ఏపీకి చెందిన వైసీపీ యువ ఎంపీకి కేంద్రం బంప‌రాఫ‌ర్ ఇచ్చింది. ఓ యువ ఎంపీకి కేంద్రం ఇంత‌టి కీల‌క‌మైన నామినేటెడ్ ప‌ద‌వి ఇవ్వడం ఇప్పుడు ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొత్త‌గా ఎంపికైన ఈ ఎంపీకి కేంద్రం కీల‌క‌మైన ప‌ద‌వి క‌ట్ట‌బెట్టడం విశేష‌మే మ‌రి. విద్యాసంస్థ‌ల ఆధినేత లావు ర‌త్త‌య్య  కొడుకైన లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లుకు కేంద్ర ప్ర‌భుత్వం ఈ కీల‌క‌మైన ప‌ద‌వి ఇచ్చింది. ఇంత‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన ఆ ప‌ద‌వి ఏమిటీ.. అనుకుంటున్నారా.. అయితే మీరు ఓసారి చూడండి.

 

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలుకు సెంట్రల్ లెవల్‌లో కీలకమైన నామినేటెడ్ పోస్ట్ దక్కింది. ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా దేవరాయలును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఐటీల్లో.. విద్యాప్రమాణాలు ఎట్లా పెంపొందించాలి, వాటిని ప్రగతి పథంలో ఎలా తీసుకెళ్లాలనే అంశాల విషయంలో..ఈ కమిటీ, కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. రాష్ట్రాలకు  ఐఐటీల కేటాయింపుకు సంబంధించి తీసుకునే కీలక నిర్ణయాల్లో సైతం ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది.

 

ఇలాంటి ప‌ద‌వులు సాదార‌ణంగా సీనియ‌ర్ స‌భ్యుల‌కు ద‌క్కుతుంది. కానీ కేంద్ర ప్ర‌భుత్వం వైసీపీ ని మ‌ద్ద‌తుదారుల్లో బ‌ల‌మైన పార్టీగా న‌మ్ముతుంది. అందుకే కేంద్ర ప్ర‌భుత్వం జూనియ‌ర్ అయిన‌ప్ప‌టికి లావు శ్రీ‌కృష్ణ‌కు ఆ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు..ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్శిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మంచి పేరున్న విఙ్ఞాన్ యూనివర్శిటీకి వైస్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ఆయనకు సదరు కమిటీలో చోటు కల్పించినట్టు సమాచారం. కాగా వైసీపీతో పాటు పలువురు టీడీపీ ఎంపీలు సైతం పార్లమెంట్ కమిటీల్లో పలు కీలక పదవులు దక్కించుకున్నారు. ప్ర‌తిసారి కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంట్ మెంబ‌ర్ల‌తో ప‌లు క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తుంది. అయితే ఇందులో ముఖ్య‌మైన ప‌ద‌వుల‌ను అధికారంలో ఉన్న పార్టీకి చెందిన స‌భ్యుల‌తో పాటుగా, అధికారంలో ఉన్న పార్టీకి మ‌ద్ద‌తుగా ఉండే పార్టీలోని స‌భ్యుల‌కు కూడా కీల‌క‌మైన ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెడుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: