దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఒక వైపు. మూఢ నమ్మకాలు మరోవైపు. మనుషుల్లో పశుప్రవృత్తి ఎక్కువవు తుండగా, దోపీడీలు దొంగతనాలు కనిపించక, సమాజంలో వ్యభిచారాలు, మానభంగాలు ఎక్కువవుతున్నాయి. ఇక డబ్బును ఎంతలా సంపాదిస్తున్నారో అంతే విలాసాలకు దారపోస్తున్నారు. దీనికి తోడు మనుషుల్లో నటన కూడా ఎక్కువైంది. సాటి మనిషితో అవసరం ఉందంటే గాంధీ లాగా ప్రవర్తిస్తాడు. లేదంటే గాడ్సేలాగా కనిపిస్తాడు.

 

 

ఇక మగవాళ్ల తప్పు ఎంతుందో అందులో పావువంతు కూడా ఆడవాళ్ల తప్పు ఉంటూంది. ఆడవారు ఇచ్చే అవకాశాల వల్లే మగవానికి అలుసుగా మారి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని వినికిడి.. ఇకపోతే ఓ యువతి తన ప్రేమకోసం ఆడిన నాటకం లో వీపు చింతపండు చేసుకుని ఆనక సమస్యలను తెచ్చిపెట్టింది. అదేంటో చూద్దాం.. ఓ యువతికి దెయ్యం పట్టిందని  ఓ హిజ్రా కర్రతో చితకబాదిన ఘటన తమిళనాడు లోని సేలం జిల్లాలో వెలుగుచూసింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

సేలం జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన యువతికి వింతగా ప్రవర్తించడంతో దెయ్యం పట్టిందేమోనని ఆమె తల్లిదండ్రులు భావించారు.అందుకు గాను ఆమెను గత వారం సేలం కన్నంగురిచ్చి ప్రాంతంలో ఉన్న శ్రీ మదురకాళియమ్మన్‌ ఆలయంలో జ్యోతిష్యం చెప్పే హిజ్రా మధుర వద్దకు తీసుకెళ్లారు.  ఆ యువతిని పరిశీలనగా చూసిన హిజ్రా తల్లిదండ్రుల ఎదుటే జుట్టు పట్టుకుని కర్రతో కొట్టింది. కాసేపటి వరకు దెయ్యం పట్టినదానిలా ఉన్న యువతి దెబ్బలు తాళలేక దారి కొచ్చింది.

 

 

తాను ఊరికెనే దయ్యం పట్టినట్లుగా నాటకం ఆడుతున్నానని ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకునేందుకు ఈ నాటకం అని తెలిపింది. దీంతో ఆ యువకుడిని మరిచిపో వాలంటూ మధుర ఆ యువతిని సుమారు 10 నిమిషాల పాటు కొట్టింది. దెబ్బలు తాళలేకపోయిన యువతి ప్రియుడిని మరిచిపోతానంటూ చెప్పడంతో కొట్టడం ఆపింది.  

 

 

ఈ తతంగానికి సంబంధించిన 14 నిమిషాల నిడివి గల వీడియోను హిజ్రా స్వయంగా తానే రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. అదికాస్తా వైరల్ కావడంతో ఆమెకు బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో తనకు రక్షణ కల్పించాలంటూ మధుర సోమవారం సేలం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి మొర పెట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: