హైదరాబాద్ లో దారుణం జరిగింది. తండ్రి పక్కన వుండగానే ఒక బాలిక దారుణంగా అత్యాచారానికి గురైంది. ఒక వైపు దిశ, సమత వంటి రేప్ ఘటనల పై అంతటా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న.. ఈ రేప్ ఘటనలు పునరావృతం కాకుండా ఆగటం లేదు.

 

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ పాతబస్తీ బండ్లగూడ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి అలీనగర్‌లోని రంగుల పరిశ్రమలో పనిచేస్తుంటాడు. ఈనెల 13న పనికి వెళ్తూ తన 11 ఏళ్ల కుమార్తెను కూడా వెంట తీసుకెళ్లాడు. అదే ఆ పాప పాలిట శాపం గా మారింది. కీచకుల చేతికి చిక్కి నలిగి పోయేలా చేసింది.

 

పనికి వెళ్ళిన తండ్రి..  పనిలో నిమగ్నమై ఉండగా, ఒంటరిగా ఉన్న పాపపై కన్నేసిన ముగ్గురు వ్యక్తులు కన్నేశారు. సమీపంలోని గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పని లో ఉన్న తండ్రి ఈ విషయం గమనించలేదు.

 

 

కీచకుల చేతిలో రేప్ కు గురైన ఆ బాలిక తీవ్రంగా భయకంపితురాలైనది. బాలిక మూడురోజులుగా పెదవి విప్పలేదు. చివరకు జరిగిన దారుణం గురించి ఇటీవల తండ్రికి ఏడుస్తూ వివరించడంతో హతాశుడైన అతడు వెంటనే చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. 

 

 

సంఘటన జరిగిన ప్రదేశం మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలోనిది కావడంతో, చాంద్రాయణగుట్ట పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి వారికి సమాచారం పంపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

 

ఇలా తండ్రితో పాటు అతడు పనిచేసే పరిశ్రమకు వెళ్లిన  బాలికపై ముగ్గురు దుండగులు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. హైదరాబాద్ నగర శివార్లలో ఇలాంటి దారుణాలు నిత్యం జరుగుతునే ఉన్నాయి. ఈ విషయం లో పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. శివారు ప్రాంతాల్లో నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: