డిసెంబరు 17న రాష్ట్ర హైకోర్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసు పంపడానికి గల కారణం ఏమిటంటే ఇంటర్మీడియట్లో 'సివిక్స్' అనే సబ్జెక్ట్ పేరును 'పొలిటికల్ సైన్స్'గా మార్పు చేయడాన్ని సవాల్ చేసిన కేసులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇంటర్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. దింతో న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్కుమార్ సబ్జెక్ట్ పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలపాలని.. పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. డిసెంబరు 30కి తదుపరి విచారణను వాయిదా వేశారు.
ఇంటర్ బోర్డు సివిక్స్' సబ్జెక్టు పేరును 'పొలిటికల్ సైన్స్'గా మారుస్తూ.. జులై నెలలో ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్కాలర్స్ అసోసియేషన్ (పీఏఎస్ఏ) ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ..ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిజానికి సివిక్స్ సబ్జెక్ట్ను ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యాక్ట్–1971 ప్రకారం ప్రవేశపెట్టారని..సివిక్స్ బోధన దేశవ్యాప్తంగా 'ప్లస్ టు' స్థాయి విద్యలో జరుగుతోందని.. ఇంటర్ బోర్డు ఎలాంటి అధికారాలు లేకపోయినా సివిక్స్ సబ్జెక్ట్ పేరును మార్చడం చెల్లదని పిటిషన్లో పేర్కొంది.
అంతేకాకుండా ఎవ్వరిని నిర్ణయం లేకుండా , నిపుణుల కమిటీ ఏర్పాటు చేయకుండా.. సివిక్స్ పేరును మార్చడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది బి రమేశ్ వాదనలు వినిపించారు.ఇంటర్ బోర్డు కేవలం ఒక అమ్మాయి కారణంగా ఇలా చేయడం సరికాదు అని చెప్పుకొచ్చారు , ఢిల్లీలోని ఒక యూనివర్సిటీలో సివిక్స్ చదివిన విద్యార్థికి బీఏ పొలిటికల్ సైన్స్ సీటు రాలేదన్న కారణంగా.. ఇలా వ్యవహరించడం సరికాదని కూడా తెలిపారు.పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ, పీహెచ్డీ చదివినవారికి ఈ నిర్ణయం వల్ల అన్యాయం జరుగుతుందని ఆయన వాదించారు. రమేశ్ ఇంటర్లో పొలిటికల్ సైన్స్ను తొలగించి యథావిధిగా సివిక్స్ సబ్జెక్టును కొనసాగించేలా ఆదేశించాలని కోర్టును కోరారు.
హైకోర్టు ఈ వాదనలు అన్ని విన్నతరువాత ఇంటర్ బోర్డుతోపాటు ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. సబ్జెక్ట్ పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలపాలని.. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను డిసెంబరు 30కి వాయిదా వేసింది.