నారావారి పుత్రరత్నం నారా లోకేష్ నాయుడుకు సెల్ఫ్ గోల్ వేసుకోవటం అలవాటైపోయింది. మీడియా సమావేశాల్లో అయితే ఏమి మాట్లాడుతుందో అని అసలు మీడియాను కలవనీయటమే లేదు. అందుకే పొద్దస్తమానం ట్విట్టర్లోనే చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. అందులో కూడా మళ్ళీ తప్పులే కనిపిస్తున్నాయి. అలాంటిది తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనపైన కూడా లోకేష్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అనిపిస్తోంది.

 

పై ఫొటోను చూస్తే లోకేష్ సెల్ఫ్ గోల్ ఎలా వేసుకున్నది స్పష్టమైపోతుంది. అధికారంలో ఉన్నంత కాలం ఇక్క ఇటుక కూడా వేయకుండానే ప్రపంచస్ధాయి రాజధాని అని పీపుల్స్ క్యాపిటల్ అంటూ ఓ భ్రమరావతిని గ్రాఫిక్స్ లో చూపించారు. ఇక్కడ విచిత్రమేమిటంటే ప్రపంచస్ధాయి రాజధాని నిర్మాణం పేరుతో అనేక దేశాలను చుట్టొచ్చారు చంద్రబాబునాయుడు.

 

ఏ దేశానికి వెళ్ళి రాజధాని చూసినా వెంటనే  ఆ దేశపు రాజధాని లాగే అమరావతిని నిర్మించేస్తానంటూ ప్రకటనలతో ఒకటే ఊదరగొట్టేవారు. ’వెంగళప్ప వెళ్ళను వెళ్ళాడు..రాను వచ్చాడు’ అనే పద్దతిలో చంద్రబాబు విదేశాలకు వెళ్ళారు... వచ్చారంతే. ఒక్క ఇటుక కూడా రాజధాని నిర్మాణానికి లేవలేదు.  చంద్రబాబు విన్యాసాలు చూసిన జనాలే విసిగిపోయి చివరకు ఘోరంగా ఓడగొట్టారు.

 

ఇపుడు అదే విషయమై  చంద్రబాబు, చినబాబులు జగన్ పై మండిపోతున్నారు. తప్పులన్నీ తమవైపు పెట్టుకుని రాజధానిపై జగన్ పూటకో మాట మాట్లాడుతున్నారంటూ ఓ ప్లకార్డు పెట్టుకుని నిరసన తెలిపారు. పైగా అమరావతిపై పూటకో మాట మారుస్తున్నారంటూ రాయించుకుని నినాదాలు చేయటమే విచిత్రంగా ఉంది.

 

రాజధాని నిర్మాణంపై  రోజుకో మాట మాట్లాడింది చంద్రబాబు మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పై జగన్ మాట్లాడింది ఇపుడు మాత్రమే. పరిపాలనా సౌలభ్యం కోసం మూడు రాజధానులుంటే తప్పు లేదన్న తన అభిప్రాయాన్ని అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించారు.  దాన్నే పూటకో మాట మార్చటంగా లోకేష్ అర్ధం చేసుకున్నారు.  మొత్తానికి లోకేష్ నిరసనతో మళ్ళీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: