టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ  సందర్భంగా కార్యకర్తలు నేతలతో చంద్రబాబు ఏర్పాటుచేసిన సమావేశంలో... టిడిపి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. చంద్రబాబు ముందే జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబును ఏకేసారు . టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సభలో ఉన్న సమయంలో  తన ప్రసంగాన్ని ప్రారంభించిన టీడీపీ మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యేలందరికీ మార్చాలని మీకు చెప్పినప్పటికీ వివిధ కారణాలతో... మీరు మాత్రం మార్చలేక పోయారు. 

 

 

ఈ విషయంలో నా పాత స్నేహితుడు మీకంటే  చాలామేలు. వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాను. ఈ సమావేశానికి నేను అందరితో చప్పట్లు కొట్టించుకునేందుకు  రాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు జేసీ దివాకర్ రెడ్డి.. అధికారంలో ఉన్నప్పుడు మాకు శాంతి వచనాలు వల్లిస్తూ చంక నాకించేశావంటూ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ . ఇకనైనా మీ శాంతి వచనాలు పక్కనపెట్టి.. మా  బాధను చూసి దాని ప్రకారం వ్యవహరించండి అంటూ తెలిపారు జేసీ . అధికారం  ఏముంది త్వరలో వస్తుంది నాకు గట్టి నమ్మకం ఉంది... రెండున్నరేళ్లలో ఎలక్షన్స్ వస్తాయి... కానీ మీరు మాత్రం మళ్లీ శాంతి వచనాలు చెబుతాను అటు మాట్లాడొద్దని జెసి తెలిపారు. ఇందాక ఇక్కడ ఎవడో  చెప్పాడు వాళ్లకి బాగా లేదు మనకి బ్రహ్మాండంగా ఉంది అంటూ తెలిపాడు. 

 

 

 

ఏంటి సార్ బ్రహ్మాండంగా ఉండేది... ఈ స్టేజి మీద ఉన్నవాళ్లు మాత్రమే ఈ ప్రభుత్వం బాగా లేదని చెబుతున్నారు.. కాయకష్టం చేసుకుంటూ బ్రతికే వాళ్ళు అందరూ జగన్  ప్రభుత్వమే బాగుంది అంటున్నారు.. ప్రజలందరిలో వాడికో మంచి పేరు వచ్చింది.. కరెక్ట్ టైం కి వస్తాడు అరగంట మాట్లాడి బైబై చెప్పి వెళ్ళిపోతాడు అని జగన్ కు మంచి పేరు వచ్చింది. కానీ మీరు మాతో ఎంత సేపు మాట్లాడారు చెప్పండి అంటూ చంద్రబాబు నిలదీస్తాడు జేసీ . ఎంతసేపు అధికారులతో మాట్లాడమే కానీ..  పార్టీ నేతలతో మాట్లాడారా  ఇకనైనా తప్పెట్లు తాళాలతో మోసపోవద్దు అంటూ సమావేశం జరుగుతున్న వేళ వేదికపైనే అధినేత చంద్రబాబు ఎదుట సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: