అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రధానంగా చంద్రబాబు విధానాలను ఆయన బహిరంగంగానే ఎండగట్టారు. చంద్రబాబు తమను సంకనాకించారూ అంటూ జేసి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపాయి. అదే విధంగా... అక్కడ జేసి ప్రసంగానికి చప్పట్లు కొడుతున్న వాళ్ళను అదుపు చేసే క్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేసారు.

 

చంద్రబాబు ఇలా చప్పట్లు కొట్టే వాళ్ళనే ఎక్కువగా నమ్మారని, తనను ముఖ్యమంత్రిగా మరోసారి చూడాలి అనుకుంటున్న వాళ్ళను నమ్మలేదని... వాళ్ళను కనీసం దగ్గరకు రానీయలేదు అంటూ జేసి వ్యాఖ్యానించారు. అదే చంద్రబాబు కొంప ముంచింది అంటూ విమర్శించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నిజమే అంటున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలే... ఇన్నాళ్ళకు చంద్రబాబు ముందు నిజం జేసి మాట్లాడారని, సోషల్ మీడియాలో, తన పక్కన ఉంటూ చంద్రబాబుకి భజన చేసిన వాళ్లకు పదవులు ఇచ్చారని, ఎన్నికల సమయంలో కూడా వాళ్ళ మాటలు ఎక్కువగా విన్నారని, వాస్తవాలకు ఆయన దూరంగా ఉన్నారని అదే పార్టీని నాశనం చేసింది అంటున్నారు.

 

ఎన్నికల సమయంలో ఎవరు ఎన్ని చెప్పినా సరే చంద్రబాబు విన్నారని, ఎవరిని కనీసం దగ్గరకు రానీయలేదని, జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు జనాలను ఎక్కువగా తీసుకొచ్చిన వారికి చంద్రబాబు ఎక్కువగా విలువ ఇచ్చారని అది పార్టీని నాశనం చేసేసిందని... వాళ్ళే వాస్తవాలను చంద్రబాబు వద్దకు వెళ్ళనీయకుండా అడ్డుకున్నారని, క్షేత్ర స్థాయి వాస్తవాలను కూడా చంద్రబాబు వద్దకు వెళ్లనివ్వలేదని అంటున్నారు. 

 

స‌రే ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత అయినా కూబా బాబు తీరులో మార్పు రాలేద‌ని చాలా మంది టీడీపీ నేత‌లు వాపోతున్నారు. పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో క‌ష్ట‌ప‌డిన వాళ్ల‌ను ప‌క్క‌న పెట్టేసి.... ఆయ‌న‌కు బాకాలు ఊదుతూ... భ‌జ‌న‌లు చేసే వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేస్తుండ‌డంతో సిన్సియ‌ర్ కార్య‌క‌ర్త‌లు ర‌గిలిపోతున్నారు. ప్ర‌స్తుతం పార్టీలో ఇదే హాట్ టాపిక్‌..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: