ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

             

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధిక ట్విట్ చేస్తూ ''మద్య నిషేదాన్ని తప్పుపట్టేలా మాట్లాడతాడు. ధరలెలా పెంచుతారని గద్దిస్తాడు. లక్ష కోట్లతో రాజధానిని ఒకే చోట నిర్మించాల్సిన అవసరమేమిటని అంటే దానికీ అడ్డుపడతాడు. ఎంత సేపూ తనవాళ్ల వ్యాపారాలు ఏమైపోతాయో అన్న ఆందోళన తప్ప రాష్ట్రం ఏమైపోయినా పట్టదు చంద్రబాబు నాయుడుకి.'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

             

ఈ ట్విట్ కి స్పందించిన నెటిజన్లు.. కొందరు విజయసాయి రెడ్డికి మద్దతు ఇస్తే మరి కొందరు చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడుకి రాష్ట్రం పట్టదు.. అందుకే గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్యాయం చేశాడు అంటూ నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ట్విట్ వల్ల అటు టీడీపీ అభిమానులు ఇటు వైసీపీ అభిమానులకు మధ్య చిన్నపాటి యుద్ధాలే జరుగుతున్నాయి. కాగా ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: