నిన్ను నమ్మిన వారికి నువ్వు ఏమిస్తావ్ అని ఒక మంచి వాన్ని అడిగితే నా ప్రాణమైనా ఇస్తా అంటాడట. ఇదే ప్రశ్న ఒక నమ్మక ద్రోహిని అడిగితే ఎన్ని ప్రాణాలైన తీస్తా అంటాడట. ఇప్పుడు లోకం తీరు ఇలాగే ఉంది. అమాయకంగా నలుగురు వెధవల మాటలు నమ్మి మానప్రాణాలు కోల్పోయిన దిశ తాలుకూ ఉదంతంలో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. అమానుషంగా రాత్రి అంతా ఒక పశువుల్లా దిశ మీద పడి అనుభవించారు. ఇది చాలదని ఆల్కాహాల్ తాగించి కౄరంగా మళ్ళీ మళ్ళీ తన నరనరాల్లోని రక్తాన్నంతా పీల్చేశారు. ఆడపిల్లగా పుట్టిన ప్రతి స్త్రీ ఎలాంటి మరణాన్నైతే కోరుకోదో అలాంటి మరణాన్నే దిశకు అందించారు.

 

 

బహుశా రావణుడు వంటి  రాక్షాసుడు కూడా ఇంతటి భయంకరమైన పనులు చేయలేదేమో అనిపిస్తుంది. దిశ ను హతమార్చిన తీరును చూస్తే. ఇకపోతే ఈ నలుగురు నిందితుల నేరచరిత్ర పరిశీలిస్తే భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయట.. ఆ నిజాలు విన్న వారికి ఇలాంటి రాక్షసులు భూమికే బరువు. వీరికి ఇక్కడ బ్రతికే అర్హత లేదని శాపనార్దాలు పెడుతున్నారు. అందుకే చచ్చి ఇన్ని రోజులైన పురుగులు పట్టి పోతున్నారే గాని వారి ఆత్మలు శాంతిగా ఉండటం లేదు.

 

 

ఇక పాతకాలంలో ఎవరైన పెద్ద మనుషులకు కోపం వస్తే నీ యిల్లు కాలిపోను, నువ్వు పురుగులు పట్టి పోతావురా అంటూ శాపాలు పెట్టే వారు. ఈ దిశ నిందితులకు ఏ పాపం తాలూకూ శాపం తగిలిందో అందుకే పురుగులు పట్టి పోతున్నారు అని అనుకుంటున్నారట లోకం.. ఇకపోతే కాల్పుల్లో హతమయిన దిశ నిందితులకు సంబంధించి.. పోలీసులు విస్మయం గొలిపే వాస్తవాలను వెల్లడించారు. అదేమంటే దిశ నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న తర్వాత..

 

 

దిశ తరహాలోనే తెలంగాణ, కర్ణాటకల్లో హైవేల వెంబడి.. మహిళలను అత్యాచారం చేసి పెట్రోల్‌తో దహనం చేసిన 15 కేసుల విషయంలోనూ వారి ప్రమేయంపై పోలీసులు ప్రశ్నించారు. తాము 9 రేప్‌లు, మర్డర్‌లకు పాల్పడ్డామని అరీఫ్, చెన్నకేశవులు అంగీకరించారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. హైవే వెంబడి ఉన్న సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌లతో పాటు తెలంగాణ సరిహ్దదున ఉన్న కర్ణాటక పట్టణాల్లో అరీఫ్, చెన్నకేశవులు నేరాలకు పాల్పడినట్టు పోలీసులు టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.

 

 

ఇక పోలీసులు 9 రేప్‌లు, నేరాలు జరిగిన సమయంలో వీరిద్దరూ ఎక్కడున్నారో తెలుసు కోవడం కోసం నిందితుల సెల్‌ఫోన్ టవర్ లొకేషన్లను  ట్రాక్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా హైవేల వెంబడి వేశ్యలు, హిజ్రాలు ఇలా చాలా మంది మహిళలను వేధించామని, దిశ లాగే 9 మంది మహిళలను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టామని అరీఫ్, చెన్నకేశవులు చెప్పారని పోలీసులు తెలిపారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: