వెటర్నరీ డాక్టర్ దిశ నిందితుల కేసులో ఒక్కొక్కటిగా సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. ప్రధాన నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ. జొల్లు నవీన్‌లు  తెలంగాణ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన దిశ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఫేక్ ఎన్‌కౌంటర్‌లో తమ వాళ్లను చంపేశారని.. దీనికి పరిహారంగా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కస్టడీలో ఉన్నవారిని తీసుకొచ్చి అమానుషంగా ఎన్‌కౌంటర్‌లో చంపేశారని.. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని వారు ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని వారు హైకోర్టును డిమాండ్ చేస్తున్నారు.

 


దిశ క‌నిపించకుండా మిస్ అయిన రాత్రి ఆమె చెల్లెలు శంషాఆద్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్ట‌డానికి వెళ్ళ‌గా అక్కడ పోలీసులు చాలా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌న్నారు. శంషాబాద్‌పోలీస్ స్టేష‌న్‌లో ఒక ఎఫ్ఐఆర్ పెట్ట‌గా, షాద్ న‌గ‌ర్‌పోలీస్ స్టేష‌న్‌లో మ‌రో ఎఫ్ ఐ ఆర్ న‌మోదైంది. ఒక అప‌రాధ‌న పైన రెండు ఎఫ్ ఐ ఆర్‌లు నమోదు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. దిశ కనిపించడం లేదని ఆమె సోదరి ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. పోలీసులు వెంటనే స్పందించలేదని నిందితులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. తను ఎవరితోనూ వెళ్లిపోయి ఉంటుందని.. దానికి మా బాధ్యత లేదన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. వెటర్నరీ డాక్టర్‌ను అత్యాచారం చేసి చంపేయడంతో.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా పోలీసుల పై ఒత్తిడి ఎక్కువ‌యిపోయింది.

 


ఇక దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై రిటర్డ్ జడ్డి నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ప్ర‌భుత్వం. ఆరునెల‌ల్లోగా ఈ కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశించారని కోర్టుకు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లో హతులైన అరీఫ్ మైనార్టీ కాగా.. మిగతా ముగ్గురు నిందితులు ఎస్సీలని.. వీరంతా పేదలని న్యాయస్థానానికి తెలిపారు. వీరు ఎలాంటి నేరాలకు పాల్పడలేదన్నారు. ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం, అసలైన నిందితులను కాపాడటం కోసం ఈ ఫేక్ ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు.

 


వీరు వేసిన పిటీష‌న్లో... ఎన్‌కౌంటర్లో చనిపోయిన వారిలో జొల్లు శివ, జొల్లు నవీన్ మైనర్లు.. పోలీసులు ఎలాంటి దయ లేకుండా వీరిని హతమార్చారని  పేర్కొన్నారు. దిశను ఈ నలుగురే రేప్ చేసి చంపేశారనడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవ‌న్నారు. ప్రజలను మెప్పించడం కోసం, కేసును మూసివేయడం కోసమే ఈ ఎన్‌కౌంటర్ చేశారన్నారు.

 

 

అంతేకాక ఈ ఎన్‌కౌంటర్ వెనుక తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు, మంత్రుల కుట్ర ఉందని ఆరోపించారు. నిందితులను శిక్షించే హక్కు పోలీసులకు లేదన్నారు. ఎన్‌కౌంటర్ ద్వారా పోలీసులు హీరోలయ్యారని.. మీడియా సమావేశంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ బాడీ లాంగ్వేజ్‌ను గమనిస్తే.. ఎన్‌కౌంటర్ పట్ల ఎలాంటి బాధ‌ కనిపించలేదన్నారు. సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సహా ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని నిందితుల కుటుంబీకులు న్యాయస్థానాన్ని కోరారు. వీళ్ళ‌ను ఎన్ కౌంట‌ర్ చేసిన ప్ర‌దేశం చుట్టూ అడ‌వి. చీక‌టి వేళలో వీళ్ళ‌ను అక్క‌డ‌కి తీసుకెళ్ళారు. ప‌ది మంది పోలీసుల బందోబ‌స్తుతో వెళ్ళిన వీళ్ళ‌కు పోలీసుల వ‌ద్ద ఉన్న తుపాకీల‌ను లాక్కుని మ‌రీ వాళ్ల మీద ఎదురు దాడి చేసేంత సీన్ లేద‌న్నారు.  కొందరు మంత్రులతో కలిసి పోలీసు ఉన్నతాధికారులు ఈ కుట్రకు పాల్పడ్డారన్నారు. ఇదిలా ఉంటే ఇక‌ర‌కంగా చెప్పాలంటే ఇదంతా ఏదో ఒక సినిమా స్టోరీని త‌ల‌పించే విధంగా ఉంది. నిజ‌నిజాలు ఏమిటి అన్న‌ది మాత్రం ఈ కేస్ విష‌యంలో స‌రిగా బ‌య‌ట‌కు రావ‌డంలేద‌ని కొంద‌రు ఆరోపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: