ప్రతి ఒక్కరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే సమయంలో కండక్టర్‌ను పిలిచి టికెట్ తీసుకునే బాధ్యత ఇక నుంచి  ప్రయాణం చేసేవారిదే.. ఇందుకు కండక్టర్లు బాధ్యులు కానే కాదు. ఒకవేళ మీ దగ్గరి నుంచి డబ్బు తీసుకొని కూడా టికెట్ ఇవ్వకపోతే, అప్పుడు మాత్రం  కండక్టర్ బాధ్యత అవుతుంది. ఇప్పటి వరుకు  బస్సులో టికెట్ లేకుండా ఏవరైనా  పట్టుబడితే, తనిఖీ అధికారులు కండక్టర్‌ను ప్రశ్నించే అవకాశాలు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం నిబంధనలు మార్చ బోతున్నారు. 

 

అంతే కాదు సరైన యూనిఫాం వేసుకోలేదు అని, అధికారులపై దురుసుగా మాట్లాడారు అంటూ‘ఇన్‌-సబార్డినేషన్‌’ కేసులు పెట్టడం వంటి ఇబ్బందులు ఇక నుంచి కండక్టర్లు, డ్రైవర్లకు ఉండవు. ఇలా  నిబంధనలు తొలగిస్తూ... ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ  నివేదిక సిద్ధం అవ్వడం జరిగింది. ఈ నివేదికను  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ నివేదిక ఆధారంగా అతి త్వరలో యాజమాన్యం ఉద్యోగ భద్రత ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్ధంగా వుంది. తాజాగా ఇందుకు సంబంధించి  మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు పురుషోత్తం, టీవీ రావు, వినోద్‌, యాదగిరితో సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది.

 

ఇక నివేదిక ప్రకారం.. కండక్టర్‌ ఒకవేళ ప్రయాణికుడి నుంచి డబ్బులు తీసుకుని, టికెట్‌ ఇవ్వలేదు అనుకుంటే కండక్టర్‌నే బాధ్యుడిగా నిలుస్తాడు అని వుంది. ఇలాంటి కేసుల్లో ఇప్పటి  వరకు ఉద్యోగాల నుంచి తొలగించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ... ఈ సారి ఇలా చేయకుండా  ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా చార్జిషీట్లు, వివరణలు, సస్పెన్షన్లను అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

 

ఇక ఆర్టీసీలో జనవరి 1 నుంచి కార్గో(సరకు రవాణా) సేవలను మొదలు పెట్టాలి అని అధికారులు మంత్రికి వివరించడం జరిగింది. కార్గో సేవలకు సీఎంనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంచాలి అని ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.. ఈ సేవలను సీఎంతోనే ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి కార్గో బస్సుపై ఓవైపు సీఎం కేసీఆర్‌ బొమ్మ, మరో పక్క రవాణా మంత్రి పువ్వాడ బొమ్మ ఉండేలాగా అధికారులు   చర్యలు తీసుకోవడం గమనించ వలసిన విషయం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: