రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రజలఆందోళన పరిశీలిస్తే, విభజననాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయని, ప్రభుత్వాలనేవి ప్రజల జీవితాలతో చెలగాటమాడటం , వ్యక్తులమధ్య ద్వేషం కారణంగా రాష్ట్ర అభివృద్ధిని, ప్రజలప్రయోజనాలను తాకట్టు పెట్టేపరిస్థితులు రావడం మిక్కిలి బాధాకరమని టీడీపీ రాజ్యసభసభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ వాపోయారు. 2014లో ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు రాష్ట్రానికి ఒకదశ-దిశ చూపి, రాజధానిగా అమరావతిని నిర్ణయించి 5కోట్లమందికి మార్గదర్శిగా నిలిచారని రవీంద్రకుమార్‌ తెలిపారు. తన అనుభవంతో, దీర్ఘకాల పరిశోధనతో, ప్రధానిసలహాతో అమరావతికి శంఖుస్థాపనచేస్తే, ఆకార్య క్రమానికి నాడుప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ హాజరుకాలేదని, అదే ఆయనకు ఈరాష్ట్రంపై ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. అధికారంలోకివచ్చిన జగన్‌, ముఖ్యమంత్రిగా రాష్ట్రప్రజలజీవితాలను సంక్షోభంలోకినెట్టేలా వ్యవహరిస్తున్నారని, ఒకపౌరుడిగా ఆలోచిస్తుంటే, బాధ కలుగుతోందన్నారు. 

 

అమరావతిలో అవినీతి జరిగిందని చెప్పినవారు, 6నెలల్లో ఏంనిరూపిం చారన్నారు. 04-09-2014న నాటిప్రతిపక్షనేతగా అసెంబ్లీలో మాట్లాడుతూ, అమరావతి నిర్మాణాన్ని విజయవాడ ప్రాంతంలో స్వాగతించిన జగన్‌, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి తప్పుపట్టడం ఆయన మాటతప్పా డనడానికి, మడమతిప్పాడనడానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్షనేతగా తానుచేసిన ప్రకటనను తిరగదోడటానికి గలకారణాలేమిటో చెప్పాల్సిన బాధ్యత జగన్‌పైనే ఉందన్నా రు. అదేవ్యక్తి ఇప్పుడు అసెంబ్లీలో మూడురాజధానులంటూ ఊహాజనిత ప్రకటనచేస్తూ, మూడురాజధానులు ండవచ్చని ముఖ్యమంత్రిహోదాలో చెప్పడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు. పొంతనలేని ప్రకటనలతో, ప్రజల్ని భయాందోళనలకు గురిచేయడం ముమ్మాటికీ రాజ్యాంగవిరుద్ధమేనన్నారు. 

 

తన ప్రకటనవెనకున్న కారణమేమిటో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్‌పై ఉందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకోసం, రాష్ట్రభవిష్యత్‌ను చీకట్లపాలుచేసే అహంకారపూరితమైన ప్రవర్తన ఆయనలో కనిపిస్తోందన్నారు. తనపార్టీసభ్యులు, మంత్రులకు కూడా చెప్పకుండా అసెంబ్లీలో ఏకపక్షప్రకటనచేసిన జగన్‌, రాజధానికి 33వేల ఎకరాలిచ్చిన వారిని వేదనకు గురిచేశాడని కనకమేడల ఆవేదనవ్యక్తంచేశారు. మానవతప్పిదంవల్ల, బాధ్యతా రహితమైన వ్యక్తి ప్రకటనవల్లే రాష్ట్రపరిస్థితి ఇలా తయారైందన్నారు. రాష్ట్రఉనికికి వ్యతిరేకంగా ప్రజల్ని  అల్లకల్ల్లోలంచేసే ప్రకటనలు, పనులు రాజద్రోహం కిందికే వస్తాయని, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారే ఈద్రోహానికి పాల్పడ్డారని రవీంద్ర కుమార్‌ మండిపడ్డారు. రైతులను పెయిడ్‌ఆర్టిస్ట్‌లన్నవారే, అసలుసిసలు పెయిడ్‌ఆర్టిస్ట్‌లని, వారే అసెంబ్లీలో, బయటా నటిస్తున్నారన్నారు.

 

ప్రతిపక్షనేతగా రాజధానిపై జగన్‌ ప్రకటనచేసిన తేదీనుంచి, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణంస్వీకారం చేసిన తేదీలమధ్యలో ఎవరైనా భూములుకొనిఉంటే, చంద్రబాబు కుట్రపన్ని తమపార్టీ నాయకులతో కొనిపించారని చెప్పొచ్చని, అలా జరిగితే దాన్ని ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ అంటారని కనకమేడల వివరించారు. ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ గురించి తెలీక,    ప్రజల్ని పక్కదోవపట్టించే ప్రకటనలు చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. ఎప్పుడు భూములక్రయవిక్రయాలు జరిగాయి.. ఆకాలంలో జరిగిన రిజిస్ట్రేషన్లు ఎన్ని, తెలుగుదేశం నాయకులెవరైనా ఉన్నారా అనే వివరాలు చెప్పకుండా, ఊరికే ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ అంటే ఎవరూ నమ్మరన్నారు. 

 

ఆకాలంలో రిజిష్ట్రార్‌ ఆఫీస్‌లో 125 ట్రాన్సాక్షన్లు జరిగాయని, వారిలో తెలుగుదేశం నాయకుడు ఒక్కరూ లేరన్నారు.     విశాఖలో భూములుధరలు పెరిగాయని, రాజధానికి కేంద్రం నిధులివ్వదని, అమరావ తిలో రైతులు భూములివ్వలేదని, అన్నీ లాక్కున్నవేనని మంత్రి పెద్దిరెడ్డి చెప్పడం దుర్మార్గమన్నారు. రాష్ట్రాన్ని పాలించడం తమాషాకాదన్న టీడీపీనేత, జగన్‌ ప్రభుత్వానికి దమ్ముంటే, పాలనచేతనైతే 30రాజధానులు కట్టిచూపించాలన్నారు. ముఖ్యమంత్రి 30వేల ఎకరాలు కావాలంటే, మంత్రేమో 300ఎకరాలు చాలని చెప్పడం, మంత్రులు బొత్స, పేర్నినాని, కొడాలినాని సభనుతప్పుదోవపట్టించేలా పూటకోతీరుగా మాట్లాడటం, ప్రజలజీవితాలతో ఆడుకోవడం  రాజ్యాంగవిరుద్ధమ న్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనవ్యాఖ్యలను వెనక్కు తీసుకొని, రాజధాని రైతులకు క్షమాపణచెప్పాలని రవీంద్రకుమా ర్‌ డిమాండ్‌చేశారు. 

 

ఉద్యమం చేస్తున్న రైతుల్ని అవహేళనచేసేలా మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయోజనాలకోసం, చంద్రబాబు చేసిన అభివృద్ధిని తుడిచేయడానికే ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందన్నారు. రైతులుభూములివ్వడం, అక్కడ రూ.9వేలకోట్ల నిర్మాణాలు జరగడం, రోడ్లువేయడం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. 13-09-2019న ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం వివిధప్రాంతాలు, మరియు రాజధాని అభివృద్ధికోసం సలహాలు సూచనలు ఇవ్వాలని ఉందన్నారు. ప్రభుత్వం నియమించిన జీ.ఎన్‌.రావుకమిటీకీ  చట్టబద్ధత లేదన్నారు. కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ప్రకారం ఆకమిటీకి న్యాయసమ్మతి లేదన్నారు. కమిటీ నివేదిక రాకముందే, జగన్‌ ప్రకటనలు చేయడం ఆకమిటీని ప్రభావితం చేయడం కాదా అని కనకమేడల ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పుప్రకారం తనపై ఉన్న 31 కేసులను త్వరగా విచారించి, చర్యలు తీసుకోమని కోరే ధైర్యంలేని జగన్‌, దిశచట్టంద్వారా 21రోజుల్లో దోషులను పట్టుకోవాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.       

మరింత సమాచారం తెలుసుకోండి: