విశాఖలో జరిగిన భూకుంభకోణం తాలూకా వాస్తవాలన్నీ బయటకు వస్తున్నా యని, ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో, జగన్‌ ఆశీస్సులతో పెద్దఎత్తున జరిగిన  భూముల బాగోతానికి సంబంధించి, 6 వేలఎకరాలు చేతులు మారుతున్నాయని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు.  విశాఖలోని టైకూన్‌ రెస్టారెంట్‌వద్ద కొన్ని క్రిస్టియన్‌సంస్థల మధ్య  3.91ఎకరాలకు సంబంధించిన వివాదాలు కోర్టులో నడుస్తుంటే, హెగ్డే అనేవ్యక్తి సాయంతో ఆ భూమిని జగన్‌ అండ్‌ కో కబ్జా చేసిందన్నారు. గజం రూ.లక్షన్నర నుంచి 2లక్షలుపలికే ఆభూమిలో, 14 అంతస్థులభవనానికి సంబంధించిన పనుల కోసం డిజైన్లు ఖరారయ్యాయని దేవినేని వివరించారు. నిర్మాణదారులకు 60శాతం, భూమి ఉన్నవారికి 40శాతమనే ఒప్పందంతో రూ.వెయ్యికోట్ల విలువైన భూమిని రూ.50కోట్లకే జగన్‌ బ్యాచ్‌ సొంతం చేసుకుందన్నారు.  

 

జగన్‌,  విజయసాయి రెడ్డి తమ పులివెందుల పంచాయతీతో ఈభూమిని హస్తగతం చేసుకొని లులూ సంస్థను విశాఖనుంచి వెళ్లగొట్టారని ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు. కోర్టు వివా దంలోని భూమిని ఆక్రమించుకోవడానికి, తన భూదాహం తీర్చుకోవడానికి జగన్‌ ఉవ్విళ్లూరుతు న్నాడన్నారు. జగన్‌కు సన్నిహితుడైన ఆడిటర్‌ లక్ష్మినారాయణకు పద్మనాభం రోడ్డులో 100 ఎకరాల లేఅవుట్‌ ఉందన్నారు. ఆ ఆడిటర్‌కు రాజ్యసభ పీటు ఇచ్చేలా జగన్‌ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాడని ఉమా పేర్కొన్నారు. సిరిపురం ఏరియాలో మరో 100 ఎకరాల లేఅవుట్‌ ఉందని, ఇవన్నీ బినామీపేర్లతో చేతులు మారాయన్నారు. మూడురాజధానుల్లో భాగంగా అడ్మినిస్ట్రేటివ్‌ కేపిటల్‌ వస్తుందని చెబుతున్న లంకెలపాలెం ఏరియాలో ఐఏఎస్‌ అధికారి ప్రభాకర్‌రావు, దళారీ నాగేశ్వరరావుల సాయంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల వివరాల సేకరణ 4నెలల క్రితమే ప్రారంభమైందన్నారు. 

 

కొత్తజైల్‌రోడ్‌లో 195 ఎకరాల గోల్ఫ్‌కోర్టు ఉంటే, దానిపక్కనే 200 ఎకరాల ప్రభుత్వభూమి ఉందని, దాన్నికాజేసి, తరువాత గోల్ఫ్‌కోర్టు భూమిని కాజేయడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు వాల్తేర్‌క్లబ్‌లో సభ్యత్వంకోసం దెబ్బలాడిన విజయసాయిరెడ్డికి, ఎన్నికలతర్వాత అక్కడ సభ్యత్వం లభించిందని, దానిలోకూడా 13ఎకరాల భూబాగోతం ఉందన్నారు. భీమిలి దగ్గరలో ముఖ్యమంత్రి నివాసంకోసం సముద్రం ఎదురుగా భూమిని సేకరించారని,  విజయసా యిరెడ్డి పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయన్నారు. కలెక్టర్లతో సమావేశాలు పెడుతూ, భూముల ఆక్రమణలకు పాల్పడుతున్న ఏ2 మాటవినని అధికారులపై కక్షసాధింపులకు పాల్పడుతున్నాడని దేవినేని మండిపడ్డారు. ఇంతపెద్దఎత్తున విశాఖలో   భూఆక్రమణలు జరుగుతుంటే, రెవెన్యూమంత్రి నుంచి ఎక్కడా స్పందనలేదన్నారు. వైఎస్‌ హయాంలో విశాఖలో ఎక్స్‌సర్వీస్‌మెన్లకు సంబంధించిన 170 ఎకరాలభూ ములు కూడా స్వాహా కానున్నాయన్నారు. 

 

చీఫ్‌సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్‌ ఆధ్వర్యంలో, సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిల సాయంతో ఈ దురాక్రమణ తంతు జరుగుతోందని మాజీమంత్రి తెలియచేశారు. సేవ్‌ విశాఖ పేరుతో ఒక స్వతంత్య్రసమరయోధుడు ఈ సమాచారాన్ని తనకు ఇచ్చారని, ఇదంతా మీరు బయటకు చెప్తే, తననుచంపేసే అవకాశాలున్నాయని ఆయన తనతో చెప్పినట్లు దేవినేని చెప్పారు. పరదేశిపాలెం, కాపులుప్పాడ, భీమిలి, కొత్తవలస, మొదలు భోగాపురం వరకు 6వేల ఎకరాలను కాజేయడానికి వైసీపీనేతలు, కార్యకర్తలు జగన్‌ కనుసన్నల్లో పనిచేస్తున్నా రన్నారు. జగన్‌ ముఖ్యమంత్రయ్యాక ఈ ఏడునెలల్లో ఎవరెవరి భూముల ఎలా చేతులుమారాయో సమాచారహక్కుచట్టం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. భూముల పంచాయతీలకోసం తాడేపల్లికి వచ్చి, విజయ్‌ని కలవాలని వైసీపీవారు చెప్పారని, విజయ్‌ అంటే ఏ2 ముద్దాయనే విషయం తరువాత విశాఖవాసులకు తెలిసొచ్చింద న్నారు. అక్కడకు వచ్చాక ఎవరైనాసరే విజయ్‌ చెప్పింది ఒప్పుకోవాల్సిందేనన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: