గత ఏడాది ముసాయిదా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సి) నుంచి తొలగించబడిన మాజీ భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మేనల్లుడి కుటుంబ సభ్యులు ఆగస్టు 31 న ప్రచురించబడిన తుది జాబితాలో కూడా మళ్లీ చేర్చబడలేదు. అస్సాం యొక్క భారతీయ పౌరులను ధృవీకరించే నవీకరించబడిన ఫైనల్ ఎన్ఆర్సి కొన్ని రోజుల క్రితం ముగిసింది, 19 లక్షల మంది దరఖాస్తుదారులు ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. చోటు దక్కించుకొని వారిలో మాజీ భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కుటుంబ సభ్యులు కూడా వున్నారు .
ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1974 నుండి 1977 వరకు భారతదేశానికి ఐదవ రాష్ట్రపతి గా పని చేశారు . ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సోదరుడి కుమారుడి కుటుంబ సభ్యుల పేర్లు తుది ఎన్ఆర్సిలో జాబితా చేర్చ బడలేదు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మేనల్లుడు కుమారుడు సాజిద్ అలీ అహ్మద్ మాట్లాడుతూ, చివరి ఎన్ఆర్సి జాబితా లో అతని పేరు చేర్చబడా లేదు అని అన్నారు . సాజిద్ అలీ అహ్మద్ మాత్రమే కాదు, అతని తండ్రి కూడా అస్సాం ఎన్ఆర్సి తుది జాబితాలో చోటు దక్కించుకోలేదు.
సాజిద్ అలీ అహ్మద్ మాట్లాడుతూ, నా తాత పేరు ఇక్రముద్దీన్ అలీ అహ్మద్, అతను మాజీ అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సోదరుడు. నేను అతని మనవడిని. మేము రోంగియా సబ్ డివిజన్ పరిధిలోని బార్బాగియా గ్రామంలో నివసిస్తున్నాము. మేము స్థానిక వాసులం. మా పేర్లు ఫైనల్ జాబితా లో చేర్చబడ లేదు . మేము దాని గురించి ఆందోళన చెందుతున్నాము. మేము భారత మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులు అయినప్పటికీ , జాబితాలో మా పేర్లు లేవు అని అయన అన్నారు. ఎన్ఆర్సి తుది జాబితా లో చేర్చబడని 19 లక్షల మందిలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు.