ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరిపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరిపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించాడు. 

            

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ''రాష్ట్రాల రాజధానుల ఎంపిక కేంద్రం పరిధిలో ఉండదని చట్టసభల సభ్యులందరికీ తెలుసు. బిజెపి ఎంపీ జివిల్ నర్సింహారావు కూడా ఈ విషయం స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు కోవర్టు సుజనా చౌదరి మాత్రం కేంద్రం చూస్తూ ఊరుకోదని బట్టలు చింపుకుంటున్నాడు. అసలు విషయమేమిటంటే అమరావతిలో ఆయన భూములున్నాయి.'' అంటూ సంచలన కామెంట్లు విజయసాయి రెడ్డి. 

             

ఈ ట్విట్ కి నెటిజన్లు స్పందిస్తూ.. ''టీడీపీ కోవర్ట్ భజనపరులు వారి రాజకీయాలు వారు చేసుకొంటే మంచిది. తమ భూములు రాజధానిలో ఉన్నాయని & బాబుగారి మీద ప్రేమతో మాట్లాడి ప్రజా ఆగ్రహానికి గురికావద్దు. మీరు బీజేపీ ఎంపీగా గెలవాలనుకుంటే టీడీపీ భజన మాటలు తగ్గించండి లేదంటే  బెత్తం నాయుడుకి పట్టిన గతే మీకు పడుతుంది సుజనా జీ.'' అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: