ఏ రంగంలో అయినా నమ్మకం అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా ముఖ్యం ఉద్యోగం అయినా రాజకీయాలు అయినా అలాంటి నమ్మకాన్ని ఈ రోజు తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరం చేసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులాలు రాజకీయాలు మతాలు వర్గాల తో సంబంధం లేకుండా తన తండ్రి నుంచి వచ్చిన అనంతమైన అభిమానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతల అభిమానం సైతం జగన్ సొంతం అయ్యింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో జగన్ అభిమానులు కోట్లలో ఉన్నారు. జగన్ క్రేజ్ రేంజ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇక తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి ఆ పార్టీలో తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ తో గుడివాడ టికెట్ దక్కించుకుని తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుని నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నా నాని చంద్రబాబు నైజాన్ని తొందరగానే గ్రహించాడు. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ముందుకు వెళుతున్న జగన్ కు ఓ అభిమాని గా మారిన నాని వైసీపీ లోకి వచ్చి ఇక్కడ కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జగన్ నిలబడ్డాడు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న టిడిపి వాళ్ళు తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాని మాత్రం జగన్ లాగా నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి జగన్ వెంటే నిలిచాడు.

 

రాజకీయంగా తనకు మంత్రి పదవి ఇచ్చినా జగన్మోహన్రెడ్డికి నిరంతరం వెంట నిలబెట్టుకున్నాడు. జగన్ కోసం చంద్రబాబును గట్స్ ఉన్న మగాడిలా కొడుతున్నాడు. ఈరోజు నాని మాట్లాడుతున్న మాటలకు చంద్రబాబు ఏమాత్రం స్పందించలేని దుస్థితి ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ తర్వాత ఆ క్రేజ్ ఒక్క వైఎస్ కు మాత్రమే దక్కింది. ఇక ఇప్పుడు ప్ర‌స్తుతం ఇటీవ‌లె జ‌రిగిన  ఎన్నిక‌ల్లో వైఎస్‌జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సీఎం అయిన విష‌యం తెలిసిందే.  ఆ ఇద్దరు సీఎంలు తర్వాత చంద్రబాబు కంటే కూడా ఆరు నెలల పాలనలో వైయస్ జగన్మోహన్ రెడ్డి  తనదైన జ‌న‌రంజిక‌మైన పాలనతో చెరగని ముద్ర వేస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఆరు నెలల్లోనే తన జోరును చూపిస్తూ ముందుకు వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: