నేడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో టిడిపి, కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలు ఎంతోమంది ఉన్నారు. జగన్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళందరూ చాలా మంది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో సరైన ప్రాధాన్యం లభించక జగన్మోహన్రెడ్డిని నమ్ముకుని వచ్చారు. తనను నమ్ముకుని తన పార్టీలోకి వచ్చిన నేతలందరికీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చే గెలిపించుకున్న జగన్ తన కోసం దేనికైనా పోరాటానికి రెడీ అనే నేతలను అక్కున చేర్చుకున్నారు.

 

ఈ క్రమంలోనే చంద్రబాబు దగ్గర తీవ్ర అవమానాలకు గురైన గుడివాడ రెబ‌ల్ కొడాలి నానికి తన క్యాబినెట్ లో కీలకమైన పౌరసరఫరాల శాఖనూ కట్టబెట్టారు. చంద్రబాబు దగ్గర తనకు నమ్మకం జగన్ దగ్గర లభించడంతో కొడాలి నాని ఆనందానికి అవధులు లేవు. గుడివాడ నుంచి వ‌రుస‌గా నాలుగోసారి గెలిచిన నాని ప్రస్తుతం వైఎస్ఆర్సిపి కీలకనేతల‌ లో ఒకరిగా ఉన్నారు. 

 

జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని ఎవ‌రైనా విమ‌ర్శిస్తే నాని అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. నాని మాట్లాడే బూతు మాట‌లు, ప‌దునైన మాట‌లు జ‌నాల్లోకి తీవ్రంగా వెళుతున్నాయి. ఈ విష‌యంలో ఒక్కోసారి త‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. జ‌గ‌న్‌ను ఎవ‌రైనా ఏమైనా అంటే తాను ఎంత‌కైనా వెళ‌తాన‌ని కూడా తెగేసి చెపుతున్నారు. అటు చంద్ర‌బాబు, లోకేష్‌, కృష్ణా జిల్లాకే చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు.. ఇలా టీడీపీ నేత‌లు ఎవ‌రు తిట్టినా స‌రే నాని అంతే ధీటుగా వాళ్ల‌పై ప‌చ్చి బూతుల తో కూడా విరుచుకు ప‌డుతున్నారు.

 

అటు చంద్ర‌బాబు, ఉమాను అయితే మ‌రీ ఘోరంగా ఆడేసుకుంటున్నారు. ఉమాను అయితే స‌న్న బియ్యం ఇస్తాను స‌న్నాసి అంటున్నావ్‌.. ఎవ‌రికి చెప్పాన్నా నీ అమ్మ మొగుడికి చెప్పానా అన్న డైలాగ్ జ‌నాల్లోకి బాగా వెళ్లింది. ఏదేమైనా జ‌గ‌న్ కోసం నాని ఎంతకైనా తెగిస్తూ ప్ర‌త్య‌ర్థుల‌కు కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఈ విష‌యంలో నాని నుంచి ఎవ్వ‌రికి ఎలాంటి మిన‌హా యింపులు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: