తూర్పు గోదావరి జిల్లా నీటిపారుదల శాఖ ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్లో పర్యవేక్షక ఇంజినీర్గా విధులు చేపడుతున్న నల్లం కృష్ణారావు అవినీతి నిరోధకశాఖ అధికారులకు దొరికాడు. నల్లం కృష్ణారావుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉండడంతో ఏసీబీ అధికారులు ఏ రాష్ట్రంలో ఆరు చోట్లతో పాటు తెలంగాణలోనూ కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ అధికారుల దాడుల్లో సుమారు రూ.15 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది.
తాజాగా ఏసీబీ అధికారులు రాష్ట్రంలో ఆరు చోట్ల, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించడం జరిగింది. ఇక ఈ ఏసీబీ అధికారులు దాడుల్లో సుమారు రూ. 15 కోట్లకు పైగా విలువ గల ఆస్తులను ఉన్నట్లు ఏసీబీ అధికారులు కనుకోవడం జరిగింది. ఇక కాకినాడ సర్పవరం జంక్షన్ సమీపంలోని పాతగైగోలుపాడు సుందర్నగర్లో ఉన్న కృష్ణారావు ఇంటిలో ఆయన బంధువులు, సహచరుల ఇళ్లలో ఒకే సమయంలో తనిఖీలను చేయడం గమనార్థకం.
కృష్ణారావు స్వ గ్రామంలో భీమవరంలో, ఆయన నివసిస్తున్న కాకినాడలో, ఇక తాను విధులు నిర్వహిస్తున్న ధవళేశ్వరంలో, అనకాపల్లిలోని ఆయన అల్లుని ఇంటిపైన, రాజమహేంద్రవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలతో పాటు హైదరాబాద్లోను దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో రూ. ఐదు కోట్లకు పైగా ఆస్తులను, అతి పెద్ద మొత్తంలో నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ప్రామిసరీ నోట్లు, స్థలాల దస్తావేజులతో పాటు రూ. 68 లక్షల బ్యాంక్ డిపాజిట్లను ఉన్నట్లు అధికారులు కనిపెట్టడం జరిగింది.
వాస్తవానికి మార్కెట్ లో వీటి విలువ ప్రకారం రూ. 3 కోట్ల 35 లక్షల 42వేల 961 అని, బహిరంగ మార్కెట్ రేట్ల ప్రకారం రూ. 15 కోట్లు పైగా ఉంటాయి అని ఏసీబీ అధికారులు తెలియచేయడం జరిగింది. ఇంకా అధికారులు బ్యాంకు లాకర్లను చూడవలసి ఉందని, దాడులు ఇంకా ఉన్నాయి అని తెలియచేయడం జరిగింది.ఇక అధికారులు ఎస్ఈ నల్లం కృష్ణారావుపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న నేరంపై అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తాము అని ఏసీబీ అడిషినల్ ఎస్పీ రవికుమార్ తెలియచేయడం జరిగింది.