అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ వ్యాక్యానించారు జగన్ .ఆ  రాజధాని విషయమై నేతలు భిన్న స్వరాలు వినిపిలుస్తున్నాయి.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మెగాసార్ట్ చిరంజీవి మద్దతు పలికారు.శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు చూసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక చదివిన తాజాగా జి.ఎన్ రావు కన్వీనర్గా ఉన్న నిపుణులు  సిఫార్సులు చూసిన అధికార పరిపాలన  వికేంద్రీకరణ లతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యం అన్నది నిర్వివాదాంశం గా కనిపిస్తుంది  అని చిరంజీవి మాట్లాడారు.

 

  మూడు రాజధానుల నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలన్నారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి జరుగుతుందని ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం నాకు ఉంది అని మాట్లాడారు . అమరావతిని శాసన నిర్వాహక, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక, కర్నూల్‌ను న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలన్నారు.

 

ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్దికై నిపుణుల కమిటి సిఫారసులు సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయి. గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది. దానివల్ల ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురికావడం వల్లే ఆర్థిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నవి . ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పులున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో    రాష్ట్రంలో ఇంకో లక్ష కోట్లు అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉంది.

 

సాగు, తాగు నీరు, ఉపాధి అవకాశాలు లేక ఊర్లు విడిచిపోతున్న వలస కూలీల బిడ్డల భవిష్యత్‌కు, నిరుద్యోగులకు మూడు రాజధానుల కాన్సెప్ట్ భద్రతనిస్తుంది.  అలాగే  రాజధాని విష్యంలో రాజధాని రైతుల్లో  నెలకొన్న భయాందోళనలు, అభద్రతాభావాన్ని కూడా  తొలగించాలి. వాళ్లు నష్టపోకుండా, న్యాయం జరిగేలా చూడాలి అని . మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్థాలు నివారించే ప్రయత్నం ప్రభుత్వం చేయాల’’ని జగన్ ప్రభుత్వానికి చిరంజీవి చెప్పారు 

మరింత సమాచారం తెలుసుకోండి: