సైరా సినిమాకు అదనపు షోలు వేసుకోవడానికి జగన్ సర్కారు చివరి నిమిషంలో అనుమతి ఇచ్చింది. దీంతో జగన్కు థ్యాంక్స్ చెప్పడానికి చిరంజీవి విజయవాడ వెళ్లారని భావించారు. . సైరా సినిమా విడుదలైన తర్వాత చిరంజీవి సతీసమేతంగా.. సీఎం జగన్ను కలిసిన తర్వాతి నుంచి ఆయన స్వరంలో మార్పు వచ్చింది. ఏపీలో జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు గుప్పిస్తున్నారు.
జగన్ తీసుకుంటున్న కీలక నిర్ణయాల పట్ల చిరంజీవి సానుకూలంగా స్పందిస్తున్నారు. దిశ చట్టానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపాక.. చిరంజీవి.. జగన్ను ప్రశంసించారు. జగన్ సర్కారుపై చిరంజీవి ప్రశంసలు గుప్పించారు. మహిళలు, లైంగిక వేధింపులకు గురవుతున్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందనే ఆశాభావాన్ని మెగాస్టార్ వ్యక్తం చేశారు. 21 రోజుల్లోనే దోషులకు శిక్ష విధించే చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ను అభినందించారు.
ఈ చట్టంపై పవన్ కళ్యాణ్ ఎలాంటి స్పందన లేదు . మూడు రాజధానులపై జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ చిరంజీవి స్పందించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో సమతుల, సమగ్రాభివృద్ధి సాధ్యం అవుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం జగన్ ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తారనే నమ్మకం ఉందన్నారు.తాజాగా ఏపీ రాజధానుల అంశంపైనా కానీ , పవన్ కళ్యాణ్ భిన్నంగా స్పందించారు. మూడు రాజధానులతో ఒరిగేదేం లేదని పవన్ వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ ఒకటి కాదని జనసేన స్పష్టం చేసింది.
ఇటీవలే పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, వైఎస్సార్సీపీ నేత అలీ మాతృమూర్తి జైతున్ బీబీ కన్నుమూశారు. తల్లి చనిపోయిన బాధలో ఉన్న అలీని చిరంజీవి స్వయంగా వెళ్లి అలీని పరామర్శించారు. గతంలో అలీతో ఎంతో స్నేహంగా మెలిగిన పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన్ను పరామర్శించడానికి వెళ్లలేదు. జగన్ విషయంలో చిరంజీవి స్పందిస్తున్న తీరు పవన్ కళ్యాణ్ను ఇరుకున బెట్టేలా ఉంది.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనాలతో ఏమాత్రం సంబంధం లేకుండా.. తాను చెప్పలనుకున్నది చిరంజీవి చెబుతుండటం మెగా ఫ్యాన్స్ను అందరిలోనూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.చిరంజీవి రాజకీయాల్లోకి పునఃప్రవేశించాలని భావిస్తే.. ఆయన్ను చేర్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. లేదంటే పవన్ పార్టీ జనసేన కూడా ఉంది.
కానీ చిరంజీవి జగన్కు అనుకూలంగా మాట్లాడుతుండటమే చాలా మందికి అర్థం కాని విషయం. . 2024 ఎన్నికల్లోగా మళ్లీ పాలిటిక్స్లో సత్తా చాటడం కోసం.. పోయిన చోటే వెతుక్కోవడం కోసం చిరంజీవి పక్కా ప్లాన్ వేశారనే వార్తలూ వస్తున్నాయి.