ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కేంద్రంగా గుంటూరు పోలీసులు సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. తాడేపల్లి పట్టణ పరిధిలో మహానాడు ప్రాంతంలో పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న అమ్మాయిలను అడ్డంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళలు వివరాలు తెలుసుకుని అరెస్టు చేశారు. అయితే ఈ క్రమంలో పోలీసులు రాక ముందే పసిగట్టడం తో విటులు పారిపోయారు. పోలీసుల దాడిలో నలుగురు మహిళలను అరెస్టు చేసి గుంటూరు పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే క్రమంలో పరారైన విటుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. 

 

హై సెక్యూరిటీ జోన్‌గా మారిన తాడేపల్లిలో తరచూ అసాంఘిక కార్యాకలాపాలు జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం.. పలు ప్రభుత్వ శాఖల రాష్ట్ర కార్యాలయాలు సైతం తాడేపల్లి పరిసరాల్లోనే కొలువుదీరాయి. ఏపీడీజీపీ కార్యాలయం.. పలువురు వీఐపీల నివాసం ఉంటున్నారు. అలాంటి హై సెక్యూరిటీ జోన్‌‌లోనూ అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకోవడం తో చుట్టుప్రక్కల సామాన్య ప్రజలు కూడా విలవిల్లాడుతున్నారు. ఇంకా అనేక అసాంఘిక కార్యక్రమాలు ఏపీ రాజధాని ప్రాంతం చుట్టూ జరుగుతున్నట్లు ఆ ప్రాంతంలో చుట్టుపక్కల వున్న ప్రజలు పోలీసులకు తమ బాధలు తెలియజేస్తున్నారు.

 

అధికారులు ముఖ్యమంత్రులు ఉండే ప్రాంతంలో ఇలాంటి పనులు జరుగుతున్నట్లు వార్తలు రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు కూడా వచ్చిన వార్తలు విని షాక్ కి గురయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అమరావతి రాజధాని ప్రాంతంలో రోజూ గస్తీ నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇటువంటి సంఘటనలు గత ప్రభుత్వం నుండి జరుగుతున్నట్లు కాలేజీ స్టూడెంట్ లు మరియు అమ్మాయిలు  రాత్రి అయితే ఇష్టానుసారంగా మోటార్ బైక్స్ మీద వచ్చి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ అసాంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని...ఇక నుండైనా చర్యలు తీసుకోవాలని పోలీసులుకు అక్కడ ఉన్న పబ్లిక్ విజ్ఞప్తి చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: