తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ పోలీసులకు దేశ వ్యాప్తంగా ఎనలేని అత్యున్నతమైన గౌరవం లభించింది అని పోలీసుశాఖ హౌజింగ్‌ బోర్డు కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గారు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయ ము ఆవరణలో దాదాపు రూ.కోటి రూపాయల నిధులతో నూతనంగా నిర్మాణం చేపట్టిన డీసీపీ కార్యాలయ భవనాన్ని శుక్రవారం రోజు ఆయన పరిశీలించడం జరిగింది. కార్యాలయములో మొక్కలు నాటి నీరుపోశారు.

 

 అనంతరం డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌తో ఇరువురి తోనూ, విలేకరులతోను మాట్లాడం జరిగినది. కేసీఆర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటగా పోలీసు శాఖను పరిశీలించిన సమయములో కనీస మౌలిక వసతుల రూపకల్పన కోసం రూ.375 కోట్లు కేటాయించారన్నారు. రెండో విడతలో రూ.500 కోట్లు విడుదల చేశారు. కొంత డబ్బును వెచ్చించి వాహనాలు కొనుగోలు చేసి పోలీస్ శాఖకు అందించినట్లు చెప్పారు. పోలీసు శాఖలో పారదర్శకత పెంచేందుకు రూల్స్ తీసుకొని వచ్చారు. ప్రతీనెలా జనరల్‌ ఖర్చుల కోసం ఎస్‌హెచ్‌ఓకు రూ.50 వేలు, పోలీస్‌స్టేషన్లకు రూ.25 వేలు, మేజర్‌ పోలీస్‌స్టేషన్లకు రూ.75వేలు విడుదల చేయడం జరుగుతుందన్నారు.

 


తెలంగాణ  రాష్ట్రవ్యాప్తంగా కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాలకు నూతన భవనాల నిర్మాణం చేస్తున్నట్లుగా చెప్పారు. రాష్ట్రంలోని నిర్మల్‌ మినహా 13 ఎస్పీ, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్‌ పరిధిలో నూతన భవన నిర్మాణాల కోసం ఒక్కోదానికి రూ.55 కోట్లను సీఎం కేసీఆర్‌ గారు రుమంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో రూ.25 కోట్లు విడుదల చేసి నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి ఎస్పీ ఆఫీసులకు కూడా రూ.25 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు స్పష్టంచేశారు. 

 

నిర్మాణాల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్న పోలీసు శాఖ ఎక్కడా కూడా రాజీలేకుండా పనిచేస్తుంది. అందువల్లే  అన్ని శాఖలు ఇటువైపు పోలీస్ శాఖ వైపే చూస్తున్నాయన్నారు. జనగామ డీసీపీ కార్యాలయంలో పై అంతస్తులో పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు చేసేందుకు మరిన్ని నిధులు కూడా మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లేష్‌ యాదవ్, ఎస్సై శ్రీనివాస్, రాజేష్‌ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: