ఏదైనా ఒక పండుగా వచ్చింది అంటే చాలు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్స్ అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఇచ్చేస్తుంది. ఆ డిస్కౌంట్ లు చూసి వావ్.. ఇంత తగ్గాయా ? అని కొందరు ఆశ్చర్య పడితే ఆఫర్ ప్రకటించక ముందు కొన్నవారు అయ్యో మన డబ్బు అంత వేస్ట్ అయ్యిందే.. కొంచం ఆగాల్సింది అన్నట్టు ప్రవర్తిస్తారు. 

                             

ఇంకా అసలు ఇప్పుడు ఎం ఆఫర్స్ ప్రకటించింది అంటే..? ఇయర్ ఎండ్ సేల్‌తో ఫ్లిప్‌కార్ట్ వచ్చేసింది. నిన్న ప్రారంభమైన ఈ సేల్ రేపటితో 23న ముగుస్తుంది. అయితే ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా ఐఫోన్7, రెడ్‌మి నోట్ 7ప్రొ, రెడ్‌మి8, రియల్‌మి 5ప్రొ, వివో జడ్1ప్రొ తోపాటు మరిన్ని మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. 

                                  

అంతేకాదు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌పై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే, నో-కాస్ట్ ఈఎంఐలు ఆప్షన్, ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులపై 75 శాతం రాయితీ ప్రకటించింది. ల్యాప్‌టాప్‌లను రూ.19,999కు లిస్ట్ చేయగా, రియల్‌మి 5 ప్రొను రూ.11,999, రియల్‌మి 8ను రూ.8,999కి ఫ్లిప్‌కార్ట్ లిస్ట్ చేసింది.

 

ఈ డిస్కౌంట్లతో పాటు ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై 75 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ల్యాప్‌టాప్‌లు, యాపిల్ వాచ్‌లు, స్పోర్ట్స్ కెమెరాలు, పవర్ బ్యాంకులు వంటివాటిపైనా భారీ రాయితీలు ఆఫర్ ఇస్తుంది. చూశారుగా.. ఎన్ని ఎన్ని డిస్కౌంట్లు ఉన్నాయి అనేది.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్లి షాపింగ్ చెయ్యండి..   

మరింత సమాచారం తెలుసుకోండి: