ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలకు కేర్ అఫ్ అడ్రస్ అని అందరికి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన రోజు నుండే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకొని ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చిందించాడు సీఎం జగన్. అధికారం చేతిలోకి తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మించి ప్రజలకు వరలు కురిపిస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు. 

 

అయితే అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన సంగతి తెలిసిందే. యువ ముఖ్యమంత్రి అయిన ప్రజల కష్టాలు తెలుసుకొని ఎక్కడ ఎవరికి ఏ బాధ వచ్చిన సరే ఆ భాద మరిచేలా వారికీ వరాలు కురిపిస్తున్నాడు. అలాంటి ఈ జగన్ అన్న హయాంలో నిరుద్యోగులకు పండుగా అని చెప్పచు. 

 

కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా చేశాడు. ఇలా ఎన్నో వరాలు ఇచ్చిన జగన్ అన్న.. జనవరిలోను మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చెయ్యనున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరిలో ఉద్యోగాల జాతర ప్రారంభం కానుంది. 44,941 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. 

 

ఏపీలోని నిరుద్యోగుల కోసం ప్రభుత్వం మరో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పోలీసు శాఖలో 13,591 పోస్టులు, డి.స్.సిలో 20,000 పోస్టులు, గ్రూప్ -2 లో 1,000 పోస్టులు, గ్రూప్ IVలో   2,600 పోస్టులు, అటవీ శాఖలో 2,750 పోస్టులు, ఇతరులు 5,000 పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల కానుంది. 

 

ఏది ఏమైనా ఆంధ్ర నిరుద్యోగులు భలే అదృష్టవంతులు. ఒకసారి మిస్ అయితే మరోసారి అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఏది ఏమైనా సీఎం జగన్ లాంటి మంచి సీఎంని పొందిన ఏపీ ప్రజలు అదృష్టవంతులు అని తెలంగాణ.. ఇతర రాష్ట్ర ప్రజలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: