టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి పోలీసులతో బూట్లు నాకిస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతుంది.. ఈ విషయం పై కర్నూలు జిల్లా నందికొట్కూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ తీవ్రంగా స్పందింస్తూ. నీకు దమ్ము, ధైర్యం ఉంటే మరోసారి అవే వ్యాఖ్యలు చేయాలని.. అప్పుడు పోలీసులంటే ఏంటో చూపిస్తారని మండిపడ్డారు.. ఈ సందర్భంగా ఒక మాజీ పోలీస్ అధికారిగా మాట్లాడుతున్నానన్న ఎమ్మెల్యే ఆర్ధర్.. పోలీసులంటే అంత నీచంగా కనిపిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు మగాడివైతే అంతమంది పోలీసులను నీ చుట్టూ రక్షణగా ఎందుకు పెట్టుకున్నావు’ అని సూటిగా ప్రశ్నించారు.

 

 

గన్‌మెన్లు లేకుంటే బయటకు వెళ్లలేని జేసీ.. పోలీసులను బూటు నాకిస్తా అంటావా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపోతే జేసీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదే కాకుండా లోకేష్ కూడా అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆర్ధర్ మండిపడ్డారు. చంద్రబాబు తనయుడు లోకేష్ చేతికి గోర్లున్నాయో.. నాగలి గొర్రులున్నాయో తెలియడం లేదని ఎద్దేవా చేశారు...

 

 

ఇలాంటి తప్పుదు మాటలు ఇంకోసారి మాట్లాడితే ఊరుకునేది లేదని.. అంతుతేలుస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇకపోతే తాడిపత్రిలో జేసీ ఆటలు ఇక సాగవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదని.. వైసీపీ ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తమ నాయకుడు జగన్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారని.. ఆయన కాలి గోటికి కూడా సరిపోవంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

 

ఇక ఈ విషయంలో తక్షణమే అనంతపురం ఎస్పీ స్పందించి జేసీ దివాకర్ రెడ్డి, అక్కడే ఉన్న చంద్రబాబుపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఆర్ధర్. ఇదే కాకుండా పోలీసులకు తాము అండగా ఉంటామని. ఇంకోసారి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: