సమాజంలో కాస్తయినా మానవత్వం కనిపించడం లేదు. రోజురోజుకు కామంతో కళ్లు మూసుకుపోతున్న మృగాళ్లు  తప్ప మనిషన్నవాడు కరువయ్యాడు అన్నట్లుగా ఉంది ప్రస్తుత రోజుల్లో పరిస్థితి. రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో  మాత్రం మార్పు రావడంలేదు. ఏపీలో దిశ చట్టం తీసుకురావడం తెలంగాణలో దిశా  అత్యాచార ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపడం.. ఇలాంటి ఘటనలు జరిగినా కూడా కామంతో కళ్లు మూసుకుపోయిన రాక్షసులు లాంటి మృగాలు అదరలేదు బెదరలేదు. వారి ఆలోచనా తీరులో మార్పు రావడం లేదు. దీంతో మహిళలు ఎక్కడికి వెళ్ళినా ప్రశ్నార్థక జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి చోట మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. 

 

 

 

 తాజాగా హైదరాబాద్ శివారులో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న మహిళపై కాంట్రాక్టర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధిత మహిళ జరిగిన విషయాన్ని బోరున విలపిస్తూ కుటుంబ సభ్యులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు మహిళతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నేరేడ్మెట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... నేరేడ్మెట్ లో  నర్సయ్య అనే వ్యక్తి కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. ఇక సాయంత్రం పని పూర్తి చేసుకొని తన దగ్గరికి వచ్చిన లేబర్ అంత ఇంటికి వెళ్లి పోతున్నారు.

 

 

 

 ఈ క్రమంలోనే పని ముగించుకుని సాయంత్రం వేళ ఇంటికి వెళ్తున్న ఓ మహిళా కార్మికురాలిని  కాంట్రాక్టర్ నరసయ్య సిమెంటు పని ఉందంటూ తనతో రమ్మన్నాడు. ఇక ఆ మహిళ కూడా ఏదో పని ఉండి ఉంటుంది అని అనుకొని అతనితో వెళ్ళింది. ఇక దారిలో ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు కాంట్రాక్టర్ నరసయ్య. ఆ మహిళతో బలవంతంగా మద్యం తాగించి ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శుక్రవారం  చోటు చేసుకుంది. అయితే పొద్దున ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు బోరున విలపిస్తూ తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరసయ్య అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: