'ఒరేయ్ దుర్మార్గుల్లారా, యాచకురాలిని కూడా వదిలిపెట్టరారా? మీకు అక్క చెల్లెలు లేరారా? మీ దుంపతెగ. ఏం బుద్ధి రా మీది' అని ఆగ్రహంతో ఊగిపోతున్నారు మీర్జాలగూడలోని ప్రజలు. ఎందుకంటే.. ఆకలితో అలమటిస్తున్న 60 ఏళ్ల వృద్ధురాలిని అన్నం పెడతామని పిలిచి అత్యాచారం చేశారు ఇద్దరు దుర్మార్గులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది.


వివరాల్లోకి వెళితే, లాలాపేటకు చెందిన చిన్నప్ప అంథోని జార్జ్‌(50), వికారాబాద్‌ జిల్లా స్టేషన్‌ ధరూర్‌కి చెందిన నేనావత్‌ విజయ్‌ కుమార్‌ కలిసి మీర్జాలగూడలోని ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. వీళ్లిద్దరి భార్యలు వీరి నీచ చేష్టలు తాళలేక ఎప్పుడో వదిలేసారు. దాంతో ఇద్దరు జులాయిలు కలిసి స్నేహితులు అయ్యారు. ఆపై పెయింటింగ్ పనులు చేసుకుంటూ బతుకు సాగిస్తున్నారు. అయితే మంగళవారం రోజు సాయంత్రం 7గంటల సమయంలో ఒక 60ఏళ్ల యచకురాలు ఆకలితో తట్టుకోలేగా ఇల్లిల్లు తిరిగి అన్నం కోసం భిక్షాటన చేస్తుంది. ఇది గమనించిన చిన్నప్ప,... 'అన్నం పెడతాం, రా లోపలికి' అంటూ ఆమెను పిలిచాడుు. పాపం, తీవ్ర ఆకలితో ఉన్న ఆమె కడుపు నింపుకుందామని ఆశతో వారి ఇంటి లోపలికి వచ్చింది.


కానీ అన్నం పెట్టకుండా వారు ఆమెతో మాట్లాడటం ప్రారంభించారు. 'అయ్యా!, ఆకలిగా ఉంది. అన్నం పెడితే తిని నేను వెళ్ళిపోతాను' అని అడిగింది. సరే, వంట గదిలోకి వెళ్లి అన్నం తీసుకొస్తానని విజయ్ వెళ్ళాడు. ఇంతలోపే, చిన్నప్ప వృద్ధురాలి గొంతులో మద్యం పోయసాగాడు. వంటగది నుండి వచ్చిన విజయ్ కూడా చిన్నప్ప తో కలిసి బలవంతంగా ఆమె గొంతులో మద్యం పోసాడు. ఆపై ఇద్దరూ  ఆమెపై కిరాతకంగా అత్యాచారం చేసారు. ఈ మానవ మృగాళ్ల ఆమెపై అఘాయిత్యం చేస్తుంటే.. భయబ్రాంతులకుు గురైన ఆమెె  రక్షించండి అంటూ గట్టిగా కేకలు వేసింది. దీంతో విషయం తెలుస్తుకున్న స్థానికులు హుటాహుటిన 100కు ఫోన్ చేసారు. అప్పుడు విజయ్, చిన్నప్ప అక్కడినుంచి పారిపోయారు.

అయితే, శుక్రవారం రోజు మీర్జాలగూడ ప్రాంతంలో సంచరిస్తున్న ఈ నిందితులను ఆ పరిధి పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజిగిరి సీఐ మన్మోహన్‌.. ఈ నీచుల గురించి మీడియాలోకి తెలియజేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: