చిత్రలహరి సినిమాకు ముందు వరకు పెద్దగా సక్సెస్ కానీ సాయి ధరమ్ తేజ్, చిత్రలహరి హిట్ తో తిరిగి గాడిలో పడ్డాడు. భలేభలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాలతో మంచి ఊపుమీదున్న మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే సినిమా డిసెంబర్ 20న విడుదల అయింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్గా నటించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్కేఎన్ సహ నిర్మాత.
కొన్ని వారాలలో చనిపోయే తండ్రి కోసం తమ బిజీ జీవితాల నుంచి అన్ని రోజులు వెచ్చించడానికి షెడ్యూల్ వేసుకొచ్చే పిల్లల మనస్తత్వంపై సోషల్ సెటైర్ వేస్తూ ఈ సీరియస్ సబ్జెక్ట్కి తనదైన రీతిలో కామెడీతో అందించాడు మారుతి. ఇక సినిమాపై కాస్త మిక్డ్స్ టాక్ వచ్చినా ఆ తర్వాత బెటర్ టాక్ తో ఈవెనింగ్ షోస్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. దాంతో మొదటి రోజు ఈ సినిమా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధించింది. సుమారు 18 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి మొదటి రోజే 3.21 కోట్ల షేర్ సాధించి సూపర్బ్ అనిపించుకుంది.
అలాగే సెకండ్ డే కూడా సూపర్ స్టడీగా వెళ్తూ 2.66 కోట్ల షేర్ ని సాధించింది. నైజాంలో సాయి తేజ్కు ఉన్న మార్కెట్ మరోసారి ప్రూవ్ అయింది. ఇక్కడ బాలయ్య రూలర్ సినిమాను పూర్తిగా డామినేట్ చేస్తున్నాడు సాయి. డీసెంట్ టాక్ ఉండటం.. క్రిస్మస్ హాలీవుడ్ కలిసిరావడంతో వీకెండ్ అయ్యేనాటికి వసూళ్లు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నారు మేకర్స్. కాగా, రాశి ఖన్నా, రావు రమేష్ కామెడీ ఈ సినిమాకు హైలైట్గా నిలిచిందని చెప్పాలి.
‘ప్రతిరోజూ పండగే’ రెండు రోజుల ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:
నైజాం- 2.5 కోట్లు
సీడెడ్- 69 లక్షలు
గుంటూరు- 45.5 లక్షలు
ఉత్తరాంధ్ర- 73 లక్షలు
తూర్పు గోదావరి- 49 లక్షలు
పశ్చిమ గోదావరి- 36 లక్షలు
కృష్ణా- 39.5 లక్షలు
నెల్లూరు- 25 లక్షలు
-----------------------------------------------------
రెండు రోజుల మొత్తం షేర్ – 5.87 కోట్లు
-----------------------------------------------------