బీజేపీ ఎంపీ సోయం బాపూరావు సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సోయం బాపూరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులు ఇవ్వకపోతే రెండు రోజులు కూడా నడవదని ఘాటుగా విమర్శించారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులను పక్కదోవ పట్టిస్తుందని విమర్శలు చేశారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి అక్కడ కాళ్లు మొక్కుతారని మరలా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తరువాత విమర్శలు చేస్తారని అన్నారు. కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వొద్దని ప్రధాని మోదీకి తానే చెప్పానని అన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోకడల వలన తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. కేసీఆర్ నిర్ణయాల వలన రాష్ట్రం సర్వనాశనమవుతోందని అన్నారు. బీజేపీ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని అన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగురవేస్తుందని సోయం బాపూరావు స్పష్టం చేశారు. కేసీఆర్ పై సోయం బాపూరావు విమర్శలు చేయటం ఇదే తొలిసారి కాదు. 
 
గతంలో సోయం బాపూరావు మాట్లాడుతూ అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లిన prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ కు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని అన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని అవినీతికి కారణమని ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎముక లేని నాలుకతో కేసీఆర్ హామీలు ఇచ్చారని హామీలను అమలు చేయటం మాత్రం మరిచిపోయారని సోయం బాపూరావు అన్నారు. 
 
మోసాలతో ఉద్యమం నడిపి మోసాలతోనే పాలన సాగిస్తున్నారని ఆరోపణలు చేశారు. రానున్న రోజుల్లో ప్రజలు కేసీఆర్ ను బయటకు పంపే రోజులు వస్తున్నాయని అన్నారు. బీజేపీ బలవంతంగా నాలుగు సీట్లు గెలిచాయంటూ కేసీఆర్ హేళన చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: