ఇప్పుడు ఎక్కడ చూడు మానభంగాలు, అక్రమ సంబంధాలు. వీటి ఉచ్చులో చిక్కుకుని పతనం అవుతున్న జీవితాలు.. ఇవే కనిపిస్తున్నాయి. ఇంతలా ఒక మనిషిని పశువుకంటే హీనంగా మార్చటంలో ఫోర్న్ వీడియోల హస్తం కూడా ఉంది. ఇదే కాకుండా తాజా సమాచారం ప్రకారం అశ్లీల వీడియోలను అదే పనిగా వీక్షించే వారిలో మహిళలు కూడా ఉన్నట్టుగా వెలువడ్డ సమాచారం సర్వత్రా విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇలాంటి వీడియోలను వీక్షించ వద్దు అని యువతులు, మహిళలకు ఇప్పటికే పిలుపునిస్తున్న కూడా పట్టించుకోవడం లేదు..

 

 

ఇక అందరిని విస్మయానికి గురిచేసే విషయం ఏంటంటే పోర్న్‌ వీడియోలను వీక్షించే వారి సంఖ్య భారత్‌లో అత్యధికంగా ఉన్నట్టు ఓ సర్వేలో తేలిందట. ఇదేకాకుండా ఈ వీడియోలకు తగ్గట్టుగానే, భారత్‌లో ఇటీవల కాలంగా మహిళలు, యువతులు, పిల్లలపై లైంగిక దాడులు, ఉన్మాద చర్యలు చాలా పెరిగాయ్..

 

 

దీంతో మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించే క్రమంలో పోలీసు యంత్రాంగం అశ్లీల వీడియోలను అదే పనిగా గంటల కొద్ది వీక్షించే వారి భరతం పట్టే దిశగా చర్యలు చేపట్టారు. చిన్న పిల్లల్ని, మైనర్లను అశ్లీలంగా చిత్రీకరించి తీసిన వీడియోలే కాదు. అశ్లీల సైట్స్‌ల్లో గంటల కొద్ది గడిపే వారిని పై గురి పెట్టి తగిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్దం చేసారు.

 

 

ఇకపోతే  రాష్ట్రంలో మూడు వేల మంది అదే పనిగా పోర్న్‌ వీడియోల్ని వీక్షిస్తూ, గంటల కొద్ది ఆన్‌లైన్‌లో గడుపుతున్నట్టుగా తేలింది. ఇందులో మహిళలు కూడా ఉన్నట్టు ప్రస్తుతం సంకేతాలు వెలువడ్డాయి. వీరు చెన్నైలో ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని స్వయంగా ఏడీజీపీ రవి పేర్కొనడం సర్వత్రా విస్మయానికి గురి చేసింది.

 

 

ఇక అశ్లీల చిత్రాల్ని వీక్షించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవడం విచారకరంగా పేర్కొన్నారు ఏడీజీపీ. ఇందులో మహిళలు కూడా ఉండడం అత్యంత బాధాకరం అన్నారు, ఇకపై దయ చేసి అశ్లీల వీడియోలను వీక్షించ వద్దు అని పిలుపు నిచ్చారు. పిల్లలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ వ్యవహారాల్ని అడ్డుకుందామని ఈ సందర్భంగా ఏడీజీపీ రవి విద్యార్థినులకు పిలుపు నిచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: