కియారా అద్వానీ చాలా ఎక్స్ పెక్ట్ చేస్తుంది కానీ.. బాలీవుడ్ మాత్రం ఈమెని పెద్దగా పట్టించుకోవడం లేదు. పెర్ఫామెన్స్, గ్లామర్ రెండింటికీ న్యాయం చేస్తున్నా.. ముంబయి మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. కియారాని మెయిన్ హీరోయిన్ గా తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు. అంటే కియారాని బీటౌన్ లైట్ గా తీసుకుంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. 


లవ్ స్టోరీస్ తో చిన్నపాటి సంచలనం సృష్టించింది కియారా అద్వానీ. ఈ డిజిటల్ ఫిల్మ్ తెచ్చిన పాపులారిటీని కబీర్ సింగ్ మరింత పెంచింది. బోల్డ్ సీన్స్ లో నటించి యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే బాలీవుడ్ మేకర్స్ మాత్రం కియారా అద్వానీని మెయిన్ హీరోయిన్ గా కన్సిడర్ చేయలేకపోతున్నారు. సెకండ్ ఆప్షన్ గానే చూస్తున్నారు.  

 

కియారా అద్వానీ తెలుగులో రెండు సినిమాలతోనే స్టార్ లీగ్ కు దగ్గరైంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో టాప్ హీరోలతో నటించి నెంబర్ రేసులో దూసుకెళ్లింది. కానీ హిందీ నాట మాత్రం కియారాకు ఇంకా ఆ లక్కీ ఛాన్స్ దొరకడం లేదు. అసలు రేసు నుంచి పక్కన పెడితే ఈమెను ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గానే చూస్తున్నారు ముంబై జనాలు. 

 

కియారా అద్వానీ ప్రస్తుతం గుడ్ న్యూస్ అనే సినిమాలో నటిస్తోంది. అక్షయ్ కుమార్, కరీనాకపూర్ మెయిన్ పెయిర్ గా కనిపిస్తుంటే.. దల్జీజ్ దొషాంజ్ తో కలిసి సెకండ్ పెయిర్ గా నటిస్తోంది కియారా. ఇక వరుణ్ ధావన్, శశాంక్ ఖైతాన్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలోనూ కియారా రెండో హీరోయిన్ గా కనిపిస్తోంది. భూమి పడ్నేకర్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సెకండ్ హీరోయిన్ రోల్స్ తో కియారా కెరీర్ ఎటు వెళ్తుందో చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: