గత రెండేళ్లుగా ఇద్దరు ప్రియులతో రాసలీలలు కొనసాగిస్తుంది ఒక భార్య. తన వివాహేతర సంబంధాలకి అడ్డు వస్తున్నాడని ఏకంగా కట్టుకున్న భర్తనే అంతమొందించాలనుకున్నది.
ఇద్దరు ప్రియుల సహాయంతో భర్తను పైకి పంపిస్తే ఇక తన వివాహేతర సంబంధానికి ఏ అడ్డూ లేకుండా పోతుందని ఆమె ఆలోచించింది. తన జీవితాంతం ఇద్దరితో కలిసి తన శృంగార కేళిని ఎంజాయ్ చేద్దామని భావించింది. భర్తను చంపేందుకు పక్కా ప్రణాళికను కూడా రూపొందించింది. ప్రణాళిక ప్రకారం.. ఈనెల 14వ తేదీన తన ప్రియులతో కలిసి భర్తను చంపేందుకు యత్నించింది.



వివరాల్లోకి వెళితే... కరీంనగర్ లో ఉంటున్న కావేరి.. గణేష్, సమాన్విత్ అనే ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త వంశీకృష్ణకు ఆమె రాసలీలలు గురించి చుట్టుపక్కల వాళ్లు తరచూ చెబుతుండేవారు. కానీ అతను ఆమెను ఏ ఒక్క సందర్భంలో కూడా అనుమానించలేదు. కానీ అనుకోకుండా ఒక రోజు వంశీకృష్ణ తన భార్య మొబైల్ యూజ్ చేస్తుండగా.. అతనికి కావేరి ఇద్దరు వ్యక్తులతో కలిసి తీసుకున్న అశ్లిల ఫోటోలు కనిపించాయి. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన వంశీకృష్ణ తన భార్యను నిలదీశాడు. కానీ భార్య సమాధానం చెప్పకుండా భర్తతో గొడవ పెట్టుకుంది. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఇద్దరి మధ్య వివాదాలు అవుతుండడంతో... కక్ష పెట్టుకున్న భార్య  భర్తను ఎలాగైనా చంపేయాలనుకుంది.


ఈ నెల 14న పొదున్నే 6 గంటల సమయంలో గణేష్, సమాన్విత్ కావేరి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో వంశీకృష్ణ పడుకున్నాడు. అదే అదునుగా భావించిన ఈ ముగ్గురు.. అతని మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేద్దామని ప్రయత్నిస్తుంటే.. భర్త తెలివిగా తప్పించుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. భార్య పెట్టిన రివర్స్ కేసుని పోలీసులు తీసుకున్నారు. దాంతో వంశీకృష్ణ 100 నెంబర్ కి ఫోన్ చేసి తనకి జరిగిన విషయం అంతా చెప్పాడు. దీంతో మరుసటి ఉదయమే పోలీసులు వారి ముగ్గురుపై కేసు నమోదు చేసి గణేష్, సమాన్విత్ లను అరెస్టు చేశారు.తను కావేరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని.. అలాంటి ఆమె తనను మోసం చేసిందని, న్యాయం చేయాలంటూ వంశీకృష్ణ కోరుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: