ప్రస్తుతం సమాజంలో బంధాలకు అనుబంధాలకు పెద్దగా విలువలు ఉండటం లేదు. భార్య, భర్త అన్న బంధాలకు విలువ లేకుండా చేస్తున్నారు కొందరు. కరీంనగర్ మంకమ్మతోటలో అక్రమ సంబంధం వద్దన్నందుకు ప్రియుళ్ళతో కలిసి తన భర్తను హతమార్చిన ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకుంది. అక్రమ సంబంధం వద్దన్నందుకు తన ఇద్దరు ప్రియుళ్లతో కలిసి హత్య చేసేందుకు ఓ భార్య చేసిన కుట్ర నుంచి ఓ భర్త తృటిలో తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ మంకమ్మతోటకు చెందిన గాలిపెల్లి వంశీక్రిష. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన కావేరీలు ఇద్దరు ప్రేమించుకున్నారు.
2010లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని, ఓ పాప, బాబుకు జన్మనిచ్చారు. అయితే... వీరి పచ్చనికాపురంలో తేడా ఎక్కడికొచ్చిందంటే. వినాయకచవిత సందర్భంగా చేసే నవరాత్రుల్లో మండపం వేసేందుకు వచ్చిన సమన్విత్ అనే యువకుడి కన్ను కావేరీ పై పడింది. సమన్విత్. అక్కడే ఉండే గణేష్ అనే మరో కుర్రాడి సహాయంతో... కావేరీతో మాటలు కలిపాడు... తనదైన శైలిలో మాయమాటలు చెప్పి గణేష్ సహాయంతో కావేరీ భర్తతో సైతం స్నేహం చేశాడు. చివరకు.. దుర్గభావాని దీక్ష అంటే వాళ్ళింట్లోనే తిష్టవేశాడు. ఈ నేపధ్యంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే కేవలం సమన్విత్తోనే కాక గణేష్తో కూడా ఈమె రెండేళ్ళుగా అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. దీంతో వారిద్దరితో ఏకాంతంగా దిగిన ఫొటోలు బయట పడటంతో భర్తకు సంబంధం గురించి తెలియగానే భార్య తీరును తప్పుబట్టి మందలించాడు.
దీంతో వారిద్దరి మధ్య గొడవలు ఎక్కువవడంతో తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని ఇద్దరి ప్రియుళ్ళతో కలిసి తన భర్తను చంపడానికి ప్లాన్ వేసింది. ఈ నెల 14వ తేదీన ఉదయం వేళ భర్త పడుకున్న సమయంలో... ప్రియుళ్ళిద్దరిని ఇంట్లోకి పిలిచి... తలకింది దిండుతో వంశీకృష్ణను హత్య చేసేందుకు యత్నించారు. ఇది గమనించిన అతను వారి బారి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడి సరాసరి పోలీస్స్టేషన్కి వెళ్ళి కేసుపెట్టారు. వంశీకృష్ణకు చుక్కెదురైంది. పోలీసులు కేసు నమోదు చేసుకోక పోగా.. ఎదురు కేసు పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో బాధితుడు డయల్ 100 ద్వారా సీపీ కమలాసన్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. స్పందించిన సీపీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త విలువ తెలుసుకోకపోగా ఏకంగా చంపడానికి కూడా వెనకాడని ఇలాంటి యువతులు కూడా ఈ ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది ఈ ఘటన.