ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధిక ట్విట్ చేస్తూ ''రాజధాని మార్పు అంత తేలిక కాదని సుజనా చౌదరి సణుగుతున్నాడు. బ్యాంకులకు ఎగ్గొట్టిన 5 వేల కోట్ల సంగతి ముందు తేల్చి, రాజధాని గురించి మాట్లాడితే బాగుంటుందని ప్రజలు అంటున్నారు. అమరావతిలో కొన్న 300 ఎకరాలకు పాత ధర కూడా వచ్చే అవకాశం లేదని నిద్ర పట్టడం లేదు కాబోలు'' అంటూ ట్విట్ చేశారు. 

 

మరో వైపు చంద్రబాబు నాయుడుపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఐదేళ్లలో నాలుగు తాత్కాలిక భవనాలు మినహా గ్రాఫిక్స్ తోనే కాలం వెళ్లబుచ్చాడు అని ఇప్పడు ప్రపంచస్థాయి రాజధానిని తరలిస్తే ఎలా అని పెడబొబ్బలు పెడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్స్ చుసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరో వైపు ఈ ట్విట్స్ కారణంగా వైసీపీ అభిమానులు టీడీపీ అభిమానుల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడిచింది. కాగా ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: