వైఎస్‌ఆర్‌ జిల్లాలో మూడు రోజుల పాటు సీఎం  వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి  పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 23 నుంచి 25 వరకూ వివిధ పనులకు శంఖుస్ధాపన చేస్తారు. తొలిరోజే స్టీల్‌ప్లాంట్‌కు పునాదిరాయి. 25న పులివెందులలో ఇండోర్‌ స్టేడియంను ప్రారంభిస్తారు. పులివెందుల, జమ్ములమడుగు, మైదుకూరు, కడప, రాయచోటి ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 23.12.2019 సోమవారం ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 12.55 గంటల ప్రాంతంలో జమ్ములమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌కు సీఎం శంకుస్ధాపన చేస్తారు. ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకొని... అక్కడి నుంచి హెలికాప్టర్​లో 11 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె-పెద్దదండ్లూరుకు చేరుకుంటారు. "ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్" ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. విభజన తర్వాత కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచినా.. కేంద్రం పట్టించుకోలేదు. జిల్లా వాసుల కల నెరవేర్చేందుకు 2018 డిసెంబర్‌ 27న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జమ్మలమడుగు నియోజకవర్గం లోని ఎం.కంబాలదిన్నె వద్ద ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని సంకల్పించారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇది మరుగున పడింది. గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన బ్రహ్మణీ స్టీల్స్‌కు-2007 జూన్ 10న అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి.. చిటిమిటిచింతల వద్ద శంకుస్థాపన చేశారు. 2009లో రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత అదీ ఆగిపోయింది.ఈ నేపథ్యంలో మూడోసారి జమ్మలమడుగు ప్రాంతంలోనే ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమ కోసం ఇప్పటికే 3వేల 148 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. 
దీన్ని రెవిన్యూ అధికారులు 4 రోజుల కిందటే ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్​కు అప్పగించారు. వారం కిందటే ఉక్కు పరిశ్రమకు అవసరమైన ఇనుప ఖనిజం తరలించారు. రెండ్రోజుల కిందటే గండికోట జలాశయం నుంచి పరిశ్రమకు అవసరమైన నీటిని కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

మధ్యాహ్నం 1.50 నుంచి 3.05 లకు దువ్వూరు మండలం నేలటూరు వద్ద మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. 3.55 నుంచి 4.05 రిమ్స్ లో వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేస్తారు. 4.20 To 4.25 వైఎస్ఆర్ ఉచిత భోజన వసతి భవనం ప్రారంభోత్సవం చేస్తారు.  4.50 నుంచి 5.00 రైల్వే ఓవర్ బ్రిడ్జిని  ప్రారంభిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. 

24.12.2019 (మంగళవారం) ఉదయం 9.05 గంటలకు – ఇడుపులపాయలోని  వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. 9.10 – దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళి అర్పిస్తారు. 2.00 – రాయచోటి సభాస్ధలికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. 
 2.15 – వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. 5.00 – ఇడుపులపాయలోని తన నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు. 

25.12.2019 (బుధవారం) ఉదయం 9.50 – క్రిస్మస్‌ సందర్భంగా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రార్ధనలు నిర్వహించనున్నారు.  11.25 To 12.10 – పులివెందుల జూనియర్‌ కళాశాల మైదానంలో పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన, వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. 3.10 తాడేపల్లిలో  బయలుదేరుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: