ఈ మద్య వివాహేతర సంబంధాలతో ఐనవారిని దారుణంగా హతమారుస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.  ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను దారుణంగా చంపిన ఘటనలు,  ప్రియురాలి మోజులో భార్యను దారణంగా చంపిన  ఘటనులు ఎన్నో చూస్తున్నాం.  తాజాగా హైదరాబాద్‌ శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.  నవమాసాలు మోసి కని పెంచుకుంటున్న కొడుకును అక్రమ సంబంధం కారణంగా ఓ తల్లి హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడో తరగతి చదువుతున్న బాలుడ్ని గొంతునులిమి హత్య చేసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా కాలనీవాసులు షాక్‌కు గురయ్యారు. అక్రమ సంబంధానికి  అడ్డు వస్తున్నాడన్న కారణంగా ప్రియుడితో కలిసి కన్న కొడుకు అంజాద్ ని సుల్తానా అనే మహిళ హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సుల్తానా మొదటి భర్త హాజీ,  జహంగీర్ పీర్ దర్గా చెందిన వ్యక్తి కొంత కాలంగా మద్యానికి బానిసవడంతో ఆమె అతని నుండి విడిపోయింది.  

 

తన భర్త ప్రతిరోజు మద్యం సేవించి తనను హింసిస్తున్నాడని.. అతనిపై విరక్తి వచ్చి విడిపోయానని ఆమె అంటుంది. హాజీ - సుల్తానా దంపతులకి ముగ్గురు కుమారులు కాగా రెండో కుమారుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఆమె వద్దనే ఉంటున్నాడు.  భర్తతో విడిపోయిన తర్వాత సుల్తాన ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది.  రోజూ వీరిద్దరూ శృంగారంలో మునిగితేలిపోతున్నారు.

 

అయితే సుల్తానాకు పిల్లలు లేరని దాచింది.. ఈ క్రమంలోనే ఆమెను చూడటానికి వచ్చిన బాబుని ఇస్మాయిల్ చూడటంతో ఎవరు అని ప్రశ్నించాడు..దాంతో సుల్తానా కోపంతో ఆ బాలుడి గొంతు నులిమి చంపేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.  అప్పటికే ఇస్మాయిల్ అనే వ్యక్తి చిన్నగా జారుకున్నాడు. పిల్లవాడు చనిపోయిన విషయంపై తల్లిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సుల్తానాను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: