ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ తాజాగా తెలంగాణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బలమైన శక్తిగా ఉందని ఆయన అన్నారు. సోమవారం బర్కత్పుర కేశవ నిలయంలో దీనిపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ పలు కార్యక్రమాలు ఏడు దశాబ్దాలుగా చేపడుతోందని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ .. 2024 నాటికి వంద ఏళ్లు పూర్తి చేసుకోబోతోందని పేర్కొన్నారు.
1600 క్లస్టర్లు ఇప్పటివరకు ఉన్నాయని.. ఆర్ఎస్ఎస్ అన్ని క్లస్టర్లకు చేరుకోవలనే లక్ష్యంతో విజయ సంకల్ప శిబిరం పేరుతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని కూడా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలు డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో జరుగుతాయని రమేష్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ కార్యక్రమాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అతిథిగా రాబోతున్నారని రమేష్ తెలిపారు.
దీనికి సంబంధించిన అన్ని కార్యక్రాలను ఎక్కడ నిర్వహించాలో కూడా నిర్ణయం తీసుకున్నారని రమేష్ తెలియజేసారు . ఈ కార్యక్రమాలు భారతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు సరూర్నగర్ స్టేడియంలో ‘సార్వజనిక సభ’ నిర్వహిస్తున్నామని రమేష్ చెప్పారు. అంతేకాదు ఈ ముఖ్య కార్యక్రమానికి కొందరు ముఖ్య అతిధులుగా ఐఐటీ హైదరాబాద్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డితో పాటు, వక్తగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొంటారని రమేష్ తెలిపారు.
నిజానికి దీని గురించి 2024 లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ప్రతి బస్తీకి ఇప్పటికే చేరుకోగలిగామని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరంలో 800 శాఖలు ఆర్ఎస్ఎస్కి ఉన్నాయని ఆయన ఈ సందర్బంగా వెల్లడించారు. ఇప్పటికే దీని ద్వారా 1005 సేవ కార్యక్రమాలు చేపట్టామని రమేష్ వెల్లడించారు. తెలంగాణ మొత్తం విస్తరించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.