కన్న పేగు కదిలిపొయో సంఘటన. నిజంగా ఇది కన్న తల్లి కడుపు కోత. ఈ కడుపు కోతకి కారణం కామాంధులు. వాళ్ళు ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళే అన్న విషయం మర్చిపోయి మృగాల్లా నిండు ప్రాణాన్ని మానభంగం చేసి ఆపై హతమార్చడం సర్వ సాధారణం అయిపోయింది. కృష్ణాజిల్లా కలిదిండి సమీపంలో మూడు రోజుల క్రితం ఉప్పుటేరులో శవమై తేలిన కటికతల కృపారాణి (25) కేసులో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త నుంచి విడిపోయిన తర్వాత కృపారాణి చికెన్ దుకాణంలో పనిచేసే ఇందిరాకాలనీకి చెందిన అజయ్‌ (30) అనే యువకుడితో సహ జీవనం చేస్తోంది. అజయ్‌కు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. కృపారాణి మోజులో అతడు కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భార్య వేరే ఊరికి వెళ్లిపోయింది. ఏడాది కాలంగా వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది.

 

కృపారాణి అత్తవారి గ్రామమైన కొత్తపల్లిలో అజయ్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ పాత ప్రియురాలిని పట్టించుకోవడం మానేశాడు. దీనికి తోడు అజయ్ తాజా ప్రియురాలు కృపారాణికి ఫోన్‌ చేసి అజయ్‌ని వదిలేయక పోతే నిన్ను భూమి మీద లేకుండా చేస్తానని పలుమార్లు హెచ్చరించింది. కృపారాణి హత్యకు గురవడానికి మూడు రోజుల ముందు అజయ్ ఆమె ఇంటికి వచ్చాడు. దీంతో ఈ హత్యోదంతంతో అతడి ప్రమేయం ఉండొచ్చని ఆమె తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.

 

గురువారం సాయంత్రం కృపారాణి ఆటోలో ఏలూరుపాడు బట్టల షాపునకు వెళ్లిందని, అదే రాత్రి హత్యకు గురైందని ఆమె తల్లి వాపోయింది. తన కూతురిని గ్యాంగ్ రేప్ చేసి చంపేసి ఉంటారంటూ సంచలన ఆరోపణలు చేసింది. కృపారాణి హత్య కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని కలిదిండి ఎస్‌ఐ జనార్థన్‌ తెలిపారు. ఈ కేసులో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. కృపారాణి ప్రియుడు అజయ్‌కూడా పోలసులు అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధం కన్న తల్లి కి శాపమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: