ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వరుస నేరాలు, మానభంగాలు, హత్యలు, ఆత్మ హత్యలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా మెదక్‌ జిల్లాలో ఓ మహిళ చెట్ల పొదల్లో శవమై కనిపించడం చుట్టు పక్కన వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా కలకలం రేపింది. మంబోజిపల్లికి చెందిన ఉప్పు పోచమ్మ(30) అనే మహిళ నవంబర్ మొదటి వారంలో ఓ వ్యక్తితో వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

తాజాగా వెల్దుర్తి మండలం రామాంతపూర్ శివారులో సోమవారం ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె గుర్తుల ఆధారంగా పోచమ్మగా గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు కూడా మృతదేహాన్ని పరిశీలించి తమ కూతురుదేనని నిర్ధారించుకున్నారు. అయితే తమ కూతురు శవాన్ని చూసిన తల్లి దండ్రులు బోరున విలపించారు. వాళ్ళ బాధ చూడలేక పక్కన వాళ్ళు సైతం కన్నీటి పర్వంతం అయ్యారు. 

 

ప్రియుడితో వెళ్లిపోయిన పోచమ్మ శవంగా కనిపించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 3వ తేదీన చిన్న శివునూర్‌కు చెందిన నర్సింహులు అనే వ్యక్తి తమ కూతురును తీసుకెళ్లాడని వారు వెల్లడించారు. తమ కూతురిపై మోజు తీరడంతో చంపేసి పొదల్లో పడేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోచమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నర్సింహులు కోసం గాలిస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు జరగడానికి కొంత అమాయకత్వం అయితే మరికొంత కోరికలు అదుపు చేసుకోలే కామంతో పరాయి మగాళ్ళతో సంబంధం పెట్టుకోవడంతో ప్రాణాలను కోల్పోతున్నారు. ఇక పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికి ఇలాంటి మృగాల నుండి అమాయకమైన మహిళలను, పసి పిల్లలను కాపాడలేకపోతున్నారు. నిజంగా ఇది ఎంతో బాధపడాల్సిన విషయం.  

మరింత సమాచారం తెలుసుకోండి: