తెలంగాణరాష్ట్రంలో తమ యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకుగాను విదేశీ యూనివర్సిటీలు అత్యంత ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారు తెలిపారు. పార్లమెంట్లో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో నూతన విద్యా విధానం బిల్లు ఆమోదం పొందగానే తెలంగాణలో విదేశీ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం ఖాయమని వినోద్ కుమార్ చెప్పారు.
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా), ఉన్నత విద్యా మండలి రెండింటి ఆధ్వర్యంలో సోమవారం బంజారాహిల్స్లో జరిగిన విద్యా సదస్సులో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగినది. తమ ప్రసంగంలో ఇలా ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. విద్యతోపాటు రాష్ట్రములో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వీలైనంతవరకూ కల్పించేందుకు, నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని చెప్పారు.
పేదలు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేస్తోందని కూడా తెలిపారు. ఈ అవకాశాన్ని యువత అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు అలాగే విదేశీ విద్యపైన కూడా మంచి అవగాహన కల్పించేందుకు జిల్లాల్లో కూడా విద్యా సదస్సులు నిర్వహించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు.
ఈ సదస్సులు యువతకు ఎంతో ఉపయోగపడే లాగా ఉండాలని సూచించారు ఈ సదస్సులో అమెరికా కాన్సులేట్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ గారు ఆటా అధ్యక్షుడు అయినా పరమేష్ భీంరెడ్డి మరియు కాబోయే అధ్యక్షుడు భువనేశ్ భుజాల తదితరులు పాల్గొన్నారు.విదేశాల్లో విద్యను అభ్యసించాలని అనుకునే విద్యార్థులు యూనివర్సిటీల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. విదేశాల్లో చదువుకున్న తర్వాత తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చి సొంత రాష్ట్రానికి సేవలు అందించాలని కూడా వినోద్ కుమార్ పేర్కొన్నారు