మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్నది.  కొత్త సంవత్సరంలో అన్ని కొత్తగా ప్రారంభించాలని భావిస్తారు.  కొత్తగా పనులు మొదలుపెట్టి.. మంచి ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.  ప్రతి ఏడాది ఇలానే చేయాలని అనుకోవడం.. కొన్ని మాత్రమే జరగడం వంటివి జరుగుతుంటాయి.  కానీ, కొన్ని మాత్రం అన్నింటికంటే వేరుగా జరుగుతుంది.  అప్పుడెప్పుడో 2012లో ప్రపంచం అంతం అవుతుందని వార్తలు వచ్చాయి.  


ఇంకేముంది అంతా అయిపోతుందని అనుకున్నారు.  కానీ, అవేమి జరగలేదు.  కాలం గడిచిపోయింది.  ప్రస్తుతం 2019లో ఉన్నాము.  మరో వారం రోజుల్లో 2020లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే.  కొత్త సంవత్సరంలో అన్ని కొత్తగా ఉండాలని కోరుకోవడం సహజమే.  2020 లో అసలేం జరగబోతుందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు.  2020 లో యుగాంతం జరగకపోవచ్చు.  కానీ, దానికి మించి ప్రపంచంలో దారుణాలు జరగబోతున్నాయి.  ఈ విషయాన్నీ వంగా బాబా అనే మహిళా 50 ఏళ్ళక్రితం చెప్పింది.  


1911లో జన్మించిన ఆ మహిళ 1966లో మరణించారు.  తనకు 12 ఏళ్ల వయసులో ఉండగా ఆమెకు కంటిచూపు కోల్పోయింది.  అనంతరం ఆమె పర్వతాల వద్దకు వెళ్లి ఆమె తన అంతర్గత శక్తులను పెంపొందించుకుంటుందట.  గతంలో ఆమె చెప్పినా ఎన్నో విషయాలు నెరవేరాయి.  దీంతో ఆమెపై నమ్మకం ఏర్పడింది.  ప్రజలు ఆమెను నమ్మడం మొదలుపెట్టారు.  ఇక 2020లో జరగబోయే కొన్ని విషయాలను ఆమె ముందుగానే ఊహించి చెప్పారు.  
2020లో ప్రపంచంలో ముస్లింల జోరు పెరుగుతుందని, వారు తమ గళాన్ని పెద్దగా వినిపిస్తారని చెప్పింది.  ప్రపంచంలో అరాచకాలు పెరిగిపోతాయని, ముఖ్యంగా యూరప్ లో బాంబుదాడులు అధికంగా జరుగుతాయని చెప్పింది.

 దీంతోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రాణహాని ఉందని చెప్పింది.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక రోగాల బారిన పడతారని చెప్పారు.  ఇండియా, రష్యా, చైనాలు ప్రపంచంలో సూపర్ పవర్ గా ఎదుగుతాయని ఆమె చెప్పింది.  ఇక ప్రపంచంలో మతపరమైన అలజడులు అధికంగా జరుగుతాయని, ప్రజలు మానవత్వం మరిచిపోయి దారుణంగా ప్రవర్తిస్తారని వంగా బాబా 50 ఏళ్ల క్రితం పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: