ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.        

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ ''రాజధాని మౌలిక సదుపాయాల పేరుతో రూ.1.09 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి తన బంధువులు, బినామీల భూముల ధరలు పెంచాలని చంద్రబాబు స్కెచ్ వేశాడు. అలా జరిగి ఉంటే వాటి విలువ 6-7 లక్షల కోట్లకు చేరేది. వికేంద్రీకరణతో ప్లాన్లన్నీ బెడిసికొట్టాయని సామూహిక శోకాలు పెడుతున్నారు.'' అంటి విజయసాయి ట్విట్ చేశాడు.  

 

ఈ ట్విట్ కి స్పందించిన నెటిజన్లు.. సార్, వాళ్ళు ఎన్ని డ్రామాలు వేసిన సింహం మైండ్లో ఒక ఆలోచన ఫిక్స్ అయ్యి ఉంటుంది. దాన్ని ఎవరు మార్చలేరు. రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దేందుకు అభివృద్ది & అధికార వికేంద్రీకరణ ద్వారానే అది సాధ్యం. ఇలా ధర్నాలతో బెదిరిపోయే వ్యక్తి కాదు అక్కడ ఉండేది. ఆ విషయం బాబు గారికి తెలుసు.! అంటూ ట్విట్స్ పెట్టారు నెటిజన్లు. దీంతో ప్రస్తుతం వీరి ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: