కామంతో కళ్లు మూసుకుపోయి ఆడపిల్లలపై మృగాల్లా అత్యాచారాలు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దిశా  కేసులో నలుగురు నిందితులను దారుణంగా ఎన్కౌంటర్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఎవరి ఆలోచనా తీరులో మార్పు రాలేదు. రేప్ చేస్తే కఠిన శిక్షలు పడతాయని భయము కనిపించడం లేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు అత్యాచారాలు హత్యలు చేసేస్తున్నారు. దీంతో  రోజురోజుకీ ఆడపిల్లల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఎక్కడికి వెళ్లిన ఆడ పిల్లలకు లైంగిక వేధింపులు మాత్రం తప్పడం లేదు. దిశా ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించిన  తర్వాత కూడా వరుసగా అత్యాచారాలు  గ్యాంగ్ రేప్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక మైనర్ బాలికపై పైశాచికత్వాన్ని చూపించారు కామందులు.ఈ  అమానుష ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. 

 

 

 బహిర్భూమికి వెళ్లిన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చోటు చేసుకుంది. గ్రామ పెద్దలు ఈ ఘటనను అక్కడికక్కడే బాధిత కుటుంబీకులకు డబ్బులు ముట్ట  చెప్పడంతో ఈ విషయం ఇప్పటివరకు వెలుగు రాలేదు చివరికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. వివరాల్లోకి వెళితే... బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి గుండ్రవాణిగూడెం లో నివాసం ఉంటుంది. అయితే బాలిక పై కన్నేసిన కామాంధులు సరైన సమయం కోసం ఎదురు చూసారు. బాలిక బహిర్భూమి కోసం బయటకు వెళ్లిన సమయంలో... అక్కడి కాపు కాసిన ఇద్దరు యువకులు ఆమెపై అతి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. 

 

 

బాధితురాలు జరిగిన గోరాన్ని  కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. వారు గ్రామ పెద్దల  దగ్గరైనా న్యాయం జరుగుతుంది అని నమ్మి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. కానీ గ్రామ పెద్దలు మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా బయటకి పొక్కకుండా బాధితురాలి కుటుంబానికి కొంత డబ్బు ముట్టచెప్పి గుట్టుచప్పుడు కాకుండానే బాలికను సొంత రాష్ట్రానికి పంపించేశారు. ఇప్పుడు ఆ నోటా ఈ నోటా పడి ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గ్రామస్తుల తో పాటు ఊరి పెద్దలు కూడా విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: