రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మహిళలపై అత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు.దిశా ఘటన నిందితులను అతి దారుణంగా ఎన్కౌంటర్ చేసి చంపిన అత్యాచారం చేయాలనుకునే వారి ఆలోచనలో  మాత్రం మార్పు రావడంలేదు. ఎక్కడికి వెళ్లిన మహిళపై లైంగిక వేధింపులు ఎదుర్కుంటూనే ఉన్నారు . మహిళలందరూ రక్షణ లేని ప్రశ్నార్ధక జీవితాన్ని గడపాలని పరిస్థితి ఏర్పడుతుంది. రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణంగా మీద పడిపోయి అత్యాచారాలు హత్యలు సైతం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. 

 

 

 

 చదువులు చెప్పి విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే విద్యార్థిపై కామంతో కళ్లు మూసుకుపోయి నీచుడీల  ప్రవర్తించాడు. సక్రమ మార్గంలో నడిపించాల్సిన గురువే...బుద్ది  లేకుండా ప్రవర్తించి ఓ యువతిపై దారుణంగా అత్యాచారానికి తెగబడ్డాడు. హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ అవమానియ  ఘటన చోటుచేసుకుంది. కళాశాలలోని ప్రయోగశాలలో ఓ విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారానికి ఒడిగట్టాడం  ప్రస్తుతం కలకలం  రేపుతోంది . వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రవెల్లి కి చెందిన వెంకటయ్య తార్నాకలో స్థిర పడ్డాడు. మైసమ్మగూడ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా ప్రయోగశాల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాడు మల్లకంటి వెంకటయ్య. 

 

 

 

 ఈ క్రమంలోనే ఓ  విద్యార్థిపై కన్నేశాడు. కాగా సోమవారం సాయంత్రం ప్రయోగం కోసం అంటూ ఓ విద్యార్థిని ల్యాబ్ పిలిచినా  వెంకటయ్య... విద్యార్థి ల్యాబ్ కు రాగానే తలుపు మూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదేరోజు బాధితురాలు తన పై జరిగిన దారుణం గురించి కుటుంబ సభ్యులకు చెప్పి బోరున విలపించింది. కాగా  వారు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి కామపు ముసుగులో గురువు గా విధులు నిర్వహిస్తున్న వెంకటయ్య ను అదుపులోకి తీసుకుని కటకటాల వెనుకకు తోసారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధిత విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: