ఇప్పటికే పెరిగిన చార్జీలతో సతమతం అవుతున్న నగర జీవికి తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది అదేమంటే బస్సు చార్జీలను తగ్గించాలని వారు నిర్ణయం తీసుకున్నారట.. ఇటీవలే ఆర్టీసీ ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో, మెట్రో లగ్జరీ ధరలను తగ్గిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక ఇప్పటికే అధికారులు టికెట్ ధరలను ఎంతమేర తగ్గించాలనే విషయంలో కసరత్తు కూడా పూర్తి చేసి, ఆమోదం కోసం ఇన్చార్జీ ఎండీ సునీల్శర్మకు పంపారట. ఇక ఆయన ఆమోద ముద్ర వేయగానే తగ్గించిన ఛార్జీలు అమలు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని, అయితే, జనవరి 1 నుంచి నగరంలో ప్రయాణించే ప్రయాణికులకు కొత్త ఛార్జీలు వర్తించవచ్చని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం తగ్గుతున్న ధరలను చూస్తే ప్రస్తుతం ఎల్బీ నగర్ నుంచి మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో లింగంపల్లికి టికెట్ రూ.110 ఉంది. అదే దిల్సుఖ్నగర్ నుంచి అయితే రూ.80 వసూలు చేస్తున్నారు. మెట్రో రైలు ఛార్జీతో పోలిస్తే ఈ ధర చాలా ఎక్కువ.
దీంతో ఎక్కువ మంది మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల మెట్రో లగ్జరీ బస్సుల్లో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. ఈ నేపథ్యం లో ప్రస్తుతమున్న రూ. 110 ధరను రూ. 75కి, రూ.80గా ఉన్న ఛార్జీని రూ.50కి తగ్గించనున్నట్లు సమాచారం. ఇకపోతే కనీస టికెట్ ధర రూ. 20ను మాత్రం అలాగే కొనసాగిస్తూ, మూడు స్టాప్ల తర్వాత ఛార్జీలను సవరించనున్నట్లు సమాచారం.
ఈ మార్పుతో మెట్రో డీలక్స్ బస్సుల కంటే.. రూ.ఐదో, రూ.పదో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికులు ఈ బస్సుల వైపు మళ్లే అవకాశం ఉంటుందనేది ఆర్టీసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాని ఆర్డినరీ బస్సుల విషయంలో పెరిగిన చార్జీలను యదావిదిగానే వసూలు చేయనున్నారు. ఇందులో మార్పు ఏం లేదట..