ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నమ్మినబంటు వైసీపీ పార్లమెంటరీ విజయసాయిరెడ్డి. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని తూచా  తప్పకుండా పాటిస్తూ ఉంటాడు. జగన్ సర్కార్ పై ప్రతిపక్షాల విమర్శలను ఎండగడుతూ ఉంటాడు వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి. జగన్ పై ప్రతిపక్షాలు ఏ చిన్న విమర్శలు చేసినా ట్విట్టర్ వేదికగా గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటాడు. తనదైన శైలిలో  ప్రతిపక్షాల తీరును ఎండగడుతూ సంచలన విమర్శలు చేస్తూ ఉంటారు విజయసాయిరెడ్డి. మరోసారి టిడిపి నేత ఎమ్మెల్సీ నారా లోకేష్ పై వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్  చేశాడు. మరోసారి తనదైన స్టైల్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయసాయిరెడ్డి. 

 

 

 పప్పు..! నిధి సార్ధక నామధేయం అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. జనాభా లెక్కలు పదేళ్లకు ఒకసారి జరుగుతాయి... దానికోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ని ఎన్ఆర్సి అని  అర్థం చేసుకున్నావ్ అంటే...నీ  ఇంగ్లీషు నీ జ్ఞానం చూసి మీ నాన్న చంద్రబాబు నాయుడు నవ్వాలో ఏడవాలో తెలియక రోజు ప్రెస్ మీట్లో  ప్రస్టేషన్ వెళ్లగక్కుతున్నాడు  అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు గుప్పించారు. అయితే విజయసాయిరెడ్డి అంతకుముందు కూడా టిడిపి నేత నారా లోకేష్ ను పప్పు అంటూ పలు మార్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై టిడిపి నేతలు కూడా మండిపడ్డారు. తాజాగా విజయ్ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. 

 

 

 ఇకపోతే బీజేపీ ఎంపీ సుజనాచౌదరి పై కూడా వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సుజనా చౌదరి పై సిబిఐ ఈడీ దర్యాప్తు జరగకపోతే ఈ దేశంలో చట్టం న్యాయం మీద నమ్మకం పోతుందని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. విచారణ అడిగితే అందుకు తాను సిద్ధం అని చెప్పకుండా తన జీవితం తెరిచిన పుస్తకం అని ఎంపీ సుజనాచౌదరి అంటున్నారు అంటూ విమర్శించారు విజయసాయిరెడ్డి. అవును సుజనాచౌదరి జీవితం తెరిచిన పుస్తకం అని బ్యాంకులను వేల కోట్ల లో ముంచిన పుస్తకం అని ఎద్దేవా చేశారు వైసిపి పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి. అయితే సుజనా చౌదరి పై ఫిర్యాదు చేస్తూ విజయసాయి రెడ్డి రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: