ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా, ఆంధ్ర పప్పు అబ్బో ఇలా ఒకటి కాదు.. రెండు కాదు బోలెడు పేర్లు ఉన్నాయి నారా లోకేష్ బాబుకి. ఎప్పుడు ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలతో తిట్టించుకుంటుంటాడు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి నారా లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.  

 

ఎప్పుడు ట్విట్టర్ లో ప్రతిపక్ష నేతలను కడిగి పారేసే విజయసాయి రెడ్డి ఈరోజు నారా లోకేష్ పై కూడా దారుణంగా కామెంట్లు చేశారు. కొడుకుపై ప్రేమతో వర్ధంతికి, జయంతికి తేడా తెలియని పప్పుని కూడా మంత్రిని చేశాడు.. కర్మ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్విట్ పై నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధిక ట్విట్ చేస్తూ ''పప్పూ! నీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటూ అర్ధం చేసుకున్నావంటే... నీ ఇంగ్లీషు,  నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజు ప్రెస్మీట్లలో  ఫ్రస్టేట్ అవుతున్నాడు.'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: