హైదరాబాద్ లో రోజురోజుకి ఆడవారిపై అఘాయిత్యాలు అధికమవుతున్నాయి. కామంతో కళ్ళుమూసుకుపోయిన నీచులు ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్న యువతుల జీవితాలని నాశనం చేస్తున్నారు. రేప్ చేసిన వారిని ఎన్కౌంటర్ చేసినప్పటికీ... మానవ మృగాళ్ల చేష్టలలో ఎటువంటి మార్పు రావట్లేదు, అసలు మద్యం మత్తులో ఉండి భయం లేకుండా అబలల జీవితాలతో ఆడుకుంటున్నారు. దీంతో, అమ్మాయిల తల్లిదండ్రులు వారి కూతుర్లు బయటికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేంతవరకు భయపడుతూనే ఉన్నారు. ఈ కామాంధులు కేవలం అమ్మాయిలపై మాత్రమే కాదు సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్న హిజ్రాలపై కూడా అత్యాచారాలు చేస్తున్నారు. 

ఇక వివరాల్లోకి వెళితే..  హైదరాబాద్లోని బాచుపల్లికి చెందిన మహేష్ ఆటోడ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అయితే మంగళవారం రోజు అతడు ఆటో వేస్తుండగా.. ఒక హిజ్రా తన ఆటోని ఎక్కింది. అయితే, అది రాత్రి సమయం అవడంతో, ఇంకా హిజ్రా ఒంటరిగా దొరకడంతో.. మహేష్ లోని కామ పిచాచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆమెను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దాంతో, భయబ్రాంతులకు గురైన ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత తన హిజ్రా స్నేహితురాలకు ఫోన్ చేసి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న మిగతా హిజ్రాలు హుటాహుటిన తన స్నేహితురాలిని చేరుకొని.. ఆ తర్వాత కామాంధుడైన మహేష్ కి దేహశుద్ది చేసారు.

ఆపై పోలీసు స్టేషన్ లో అతనిని అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు మహేష్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలు హిజ్రాకు, మహేష్ కు గతంలోనే పరిచయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, మహేష్ ని కఠినంగా శిక్షించాలని హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: