జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అచేతనావస్థలో ఉందని, ఎవరేమనుకున్నా స్పందించడ  ంలేదని, దున్నపోతుమీద వానకురిసినట్లుగా ప్రభుత్వ వ్యవహారశైలి ఉందని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఎద్దేవాచేశారు. బుధవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మేథావులు, ప్రజాసంఘాలు, కోర్టులు, ప్రతిపక్షం, ప్రజలు ఎన్నిచెప్పినా ఖాతరు చేయకుం డా జగన్‌ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. అస్మదీయులు, తస్మదీయులుని విభజించి మరీ రాష్ట్రప్రభుత్వం పరిపాలన సాగిస్తోందన్నారు. 

 

అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో వడ్డిస్తూ, వ్యక్తిగత కక్షతోనే కొందరు అధికారులపై జగన్‌ప్రభుత్వం కక్షసాధింపు లకు పాల్పడుతోందన్నారు. జగతి పబ్లికేషన్స్‌ షేర్‌వ్యాల్యూ పెరుగుదలలోని లోగుట్టుని,  ఆనాడు నష్టాల్లో ఉన్న పత్రికాసంస్థ సాక్షిలో నిమ్మగడ్డ ప్రసాద్‌ పెట్టుబడుల వ్యవహారాన్ని  బయటపెట్టాడన్న దురుద్దేశంతోనే కృష్ణకిశోర్‌పై జగన్‌ కక్షసాధిస్తున్నా డన్నారు. జగన్‌  ఎంపీగా ఉన్నప్పుడు జగతిపబ్లికేషన్స్‌ షేర్‌వ్యాల్యూ రూ.10లోపుగా ఉంటే, ఒక్కోషేర్‌ని రూ.350కి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. వాన్‌పిక్‌సంస్థకి చెందిన నిమ్మగడ్డప్రసాద్‌ షేర్లకొనుగోలుద్వారా రూ.  834కోట్లు జగతిపబ్లికేషన్స్‌లో పెట్టుబడిగా పెట్టాడన్నారు. ఈ ఉదంతంపై సీబీఐ విచారణ జరిపేక్రమంలో జగతిపబ్లికేషన్స్‌కి నిమ్మగడ్డ ప్రసాద్‌కి మధ్య జరిగిన లాలూచీ వ్యవహారాన్ని ఆనాడు ఇన్‌కంటాక్స్‌ అధికారిగా ఉన్న కృష్ణకిశోర్‌ బయటపెట్టడం జరిగిందన్నారు. 


గతంలో తన విధినిర్వహణను సక్రమంగా చేసిన సదరు అధికారి చర్యను మనసులోపెట్టుకున్న జగన్‌, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అతన్ని సస్పెండ్‌ చేసి, జీతంకూడా ఇవ్వకుండా నిలిపివేశాడని, దీనిపైనే క్యాట్‌ (సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌) జోక్యం చేసుకుందన్నారు. కృష్ణకిశోర్‌పై సీఐడీ విచారణకు ఆదేశించిన జగన్‌సర్కారు, ఆనివేదిక వచ్చేవరకుకూడా ఆగకుండా అతనిపై చర్యలు తీసుకోవడం  కక్షసాధించడం కాదా అని రామయ్య ప్రశ్నించారు.  కేంద్రసర్వీసులకు తిరిగివెళ్తానన్నా,  వెళ్లనివ్వకుండా ఆ అధికారి హోదానుమార్చి, అతనికి జీతభత్యాలు చెల్లించకుండా ఎలా నిలిపివేస్తారని  రాజ్యాంగబద్ధసంస్థ అయిన క్యాట్‌ జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీసిం దన్నారు. 

 

తప్పుడుశక్తులు జగన్‌ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని, దీనిని ఇలానే కొనసాగిస్తే పరిపాలించడానికి చివరకు ఏమీ మిగలదని కూడా క్యాట్‌ చెప్పిందని వర్ల స్పష్టంచేశారు. మాటవినని అధికారుల్ని అధికారమనే ఉక్కుపాదంతో జగన్‌ సర్కారు అణచివేస్తోందన్నారు. క్యాట్‌ వ్యాఖ్యలతోనైనా జగన్‌ తన ధోరణి మార్చుకోవాలని వర్ల సూచించారు. పీపీఏల రద్దు , పోలవరం రివర్స్‌ టెండర్లు, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులేయడం వంటి  చర్యలపై కోర్టులతో మొట్టికాయలు వేయించుకోవడంతో, జగన్‌ బుర్ర పనిచేయడం లేదని ఆయన దెప్పిపొడిచారు. రాష్ట్రంలో ఇంతజరుగుతుంటే 3 నుంచి 4లక్షల జీతం జగన్‌ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారన్నారు. తిరోగమన దిశలో జగన్‌ ప్రభుత్వం నడుస్తోందన్నారు. తనపైఉన్న కేసులవిచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రాజధానిలో రగడ సృష్టించాడన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: