అందుకే చెడు తిరుగుళ్ళు తిరుగొద్దని పెద్దోళ్ళు అంటారు. కానీ ఈ రోజుల్లో మగ ఆడ తారతమ్యం లేకుండా యుక్త వయసు వారు శారీరక సుఖం కోసం అన్నీ హద్దులను దాటుతున్నారు. దానికి సరైన ఉదాహరణే మనం ఈరోజు చెప్పుకోబోయే యువతి. ఆమె పెళ్లికాక ముందు ఇష్టారాజ్యంగా తన కామవాంఛలను తీర్చుకుంది. ఇలా ఎన్నో సార్లు అడ్డదారి తొక్కిన ఆమె మరొకరిని వివాహం చేసుకోవడానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాపం, దాంతో అతని వివాహం అభాసుపాలు అయింది.

వివరాల్లోకి వెళితే, పశ్చిమ బెంగాల్ లోని బీర్బుమ్‌లో కుమార్(పేరు మార్చబడినది) తన గ్రామానికే చెందిన యువతిని ఏరికోరి తన పెళ్ళికి ఎంచుకున్నాడు. పెళ్లి కొడుకు బంధువులు కూడా అమ్మాయి వారి ఇంటికి వెళ్లి పెళ్ళి ముహూర్తాలను కుదుర్చుకున్నారు. ఇష్టపడిన అమ్మాయితో వివాహమవుతుందని కుమార్ బాగా సంతోషించాడు. అయితే మొన్న అనగా డిసెంబర్ 24న వారి పెళ్ళి తంతు ప్రారంభమయింది. అప్పుడు, పెళ్ళి కూతురు అందంగా రెడీ అయ్యి పెళ్ళి పీటలమీదకు వచ్చి సుకుమారంగా కూర్చుంది.

పెళ్లి మండపం వధువు, వరుడు బంధువులు, స్నేహితులు, తెలిసిన వారితో కళకళలాడుతుంది. అప్పుడే, అయ్యగారు.. 'తాళి కట్టు,నాయన' అనగానే వేద మంత్రాలు, పెళ్లి వాయిద్యాల మధ్య అతను పెళ్లికూతురు మెడలో మూడు ముళ్ళు వేసాడు. ఆ తర్వాత కొద్ది సమయంలోనే, నవ వధువు తీవ్ర అస్వస్థత గురైంది. ఏమైందో అర్థం కాని బంధువులు వెంటనే డాక్టర్ ని పిలిపించారు.

 

ఆమెను చెకప్ చేసిన డాక్టర్.. 'మీ భార్య 5నెలల గర్భవతి' అని వరుడికి మెల్లగా చెప్పాడు. దాంతో, షాకైన వరుడు.. కొన్ని సెకన్ల పాటు నిర్ఘాంతపోయి ఆ తర్వాత తేరుకొని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ విషయం కాస్త పెళ్లి మండలంలోని అందరికీ తెలిసి.. వారంతా నోరెళ్ళబెట్టారు. ఆపై 5నెలల గర్భవతిని ఇచ్చి పెళ్లి చేస్తారా అని వరుడు కుటుంబ సభ్యుల వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు. దాంతో పెళ్లి మండపం వద్ద ఇరువురి కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తర్వాత ఆమెను గర్భవతిని చేసింది తన స్నేహితుడు అని తెలిసి..అతనిపై ఫిర్యాదు చేశారు యువతి తల్లిదండ్రులు.





మరింత సమాచారం తెలుసుకోండి: